తెలుగులో తక్కువ సినిమాలే చేసినా మంచి గుర్తింపును సొంతం చేసుకున్న హీరోయిన్లలో కియారా అద్వానీ ఒకరు.భరత్ అనే నేను, వినయ విధేయ రామ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన ఈ బ్యూటీ చరణ్ శంకర్ కాంబో మూవీతో మరోసారి బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుంటానని నమ్మకాన్ని కలిగి ఉన్నారు.
సిద్దార్థ్ మల్హోత్రా తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేకపోయినా బాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు ఉన్న హీరోలలో ఒకరు.
సిద్దార్థ్ కియారా పెళ్లి చేసుకోవడంతో సోషల్ మీడియా వేదికగా వీళ్లిద్దరి ఆస్తుల గురించి జోరుగా చర్చ జరుగుతోంది.సిద్దార్థ్ కియారా నికర ఆస్తుల విలువ 125 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తమని తెలుస్తోంది.సిద్దార్థ్ ఒక్కో సినిమాకు 8 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటుండగా కియారా అద్వానీ మాత్రం ఒక్కో సినిమాకు 3 కోట్ల రూపాయల రేంజ్ లో పారితోషికం అందుకుంటున్నారని తెలుస్తోంది.
కియారా అద్వానీకి ముంబైలో ఖరీదైన ఫ్లాట్ ఉండటంతో పాటు ఇతర స్థిరాస్థులు కూడా కొనుగోలు చేశారు.కియారా, సిద్దార్థ్ దగ్గర ఖరీదైన కార్లు కూడా ఉన్నాయని తెలుస్తోంది.కియారా సిద్దార్థ్ కలకాలం సంతోషంగా ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు.సౌత్ సినిమాలకు కియారా అద్వానీ ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు.తారక్ కొరటాల శివ కాంబో సినిమాలో సైతం కియారా అద్వానీ పేరును పరిశీలిస్తున్నారు.
కియారాకు సౌత్ నుంచి ఫ్యాన్ బేస్ పెరుగుతుండగా తెలుగు సినిమాలకు ఆమె ఏ రేంజ్ లో ప్రాధాన్యత ఇస్తారో అనే చర్చ కూడా జరుగుతోంది.చరణ్ శంకర్ కాంబో మూవీ సక్సెస్ సాధిస్తే కియారా అద్వానీకి తిరుగుండదని కొంతమంది సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్లు వైరల్ అవుతున్నాయి.కియారాకు రోజురోజుకు క్రేజ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.