ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు అంతకంతకు పెరుగుతున్నాయి.ఈ సమయంలో మృతుల సంఖ్య కూడా విపరీతంగా పెరుగుతోంది.
అయితే ఇక్కడ మనం ఆనందించాల్సిన విషయం ఏంటీ అంటే మన దేశంలో కరోనా రికవరీ రేటు చాలా ఎక్కువ ఉంది.అలాగే మృతుల రేటు చాలా తక్కువగా ఉంది.
కరోనా రికవరీ గురించి ఉన్న అనుమానాలు పటాపంచలు అవుతున్నాయి.గత నెల రోజులుగా దేశంలోని పలువురు ప్రముఖులు కరోనా బారిన పడ్డారు.వారిలో 99.9 శాతం మంది రివరీ అవుతున్నారు.తాజాగా కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ద రామయ్య కూడా కరోనాను జయించారు.
ఈనెల 3వ తారీకున సిద్ద రామయ్య కరోనా పాజిటివ్ అంటూ నిర్థారణ అయ్యింది.
దాంతో ఆయన బెంగళూరులోని ప్రముఖ ఆసుపత్రిలో జాయిన్ అయ్యి చికిత్స పొందరు.దాదాపు పది రోజుల తర్వాత ఆయన పూర్తిగా రికవరీ అయినట్లుగా వైధ్యులు ప్రకటించారు.
పెద్దగా సింటమ్స్ లేకుండానే సిద్దరామయ్య కరోనాను ఎదుర్కొని జయించారు.ఇటీవల ఆయనకు పరీక్ష నిర్వహించగా నెగటివ్ వచ్చింది.
దాంతో ఆయన్ను డిశ్చార్జ్ చేశారు.ఇటీవలే కర్ణాటక సీఎం యడ్యూరప్ప కరోనాను జయించిన విషయం తెల్సిందే.
ప్రస్తుతం కన్నడ మంత్రి శ్రీరాములు కరోనాతో బాధపడుతున్నారు.ఈయన ఆరోగ్య శాఖ మంత్రి.
త్వరలో ఈయన కూడా కోలుకుంటారని ఆశిద్దాం.