డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ భార్య లావణ్య తనను పాల్వంచ ఎస్.ఐ వేదించాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
‘ఆంధ్రాపోరి’ మూవీ షూటింగ్ కోసం పాల్వంచలో దాదాపు పది రోజులుగా చిత్ర యూనిట్ సభ్యులు అక్కడే ఉన్నారు.తాజాగా షూటింగ్ ముగించుకుని హోటల్కు వెళ్లిన చిత్ర యూనిట్ సభ్యులతో ఎస్.
ఐ అసభ్యకరంగా మాట్లాడాడట.హీరోయిన్ ఉల్క గుప్తతో ఎస్.
ఐ అసభ్యకరంగా ప్రవర్తించాడట.దాంతో అక్కడే ఉన్న లావణ్య అందుకు అడ్డు చెప్పింది.
ఆ సమయంలో లావణ్యతో కూడా సదరు ఎస్.ఐ అవమానకర రీతిలో ప్రవర్తించాడని తెలుస్తోంది.
దాంతో లావణ్య మరియు ఇతర చిత్ర యూనిట్ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది.జిల్లా ఎస్పీ ప్రస్తుతం ఈ కేసును విచారిస్తున్నట్లుగా ఆ సినిమా యూనిట్ సభ్యులు చెప్పుకొచ్చారు.
ఎస్.ఐను కఠినంగా శిక్షించాలంటూ చిత్ర యూనిట్ సభ్యులు కోరుతున్నారు.
సినిమా వారు అంటే చిన్న చూపు ఉన్న వారికి ఆ శిక్ష ఎప్పుడు గుర్తుకు రావాలని కూడా అంటున్నారు.