మాదకద్రవ్యాల నిర్మూలనపై గ్రామస్తులకు అవగాహన కల్పించిన ఎస్సై గణేష్

రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో తెలంగాణ చౌరస్తా వద్ద ఎస్సై గణేష్ ఆధ్వర్యంలో గంజాయి మాదక ద్రవ్యాల నిర్మూలనపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా ఎస్సై గణేష్ మాట్లాడుతూ మండలంలో గంజాయి వంటి మాదక ద్రవ్యాలను సాగు చేసినట్లుగాని, రవాణా చేసినట్లు, సేకరిస్తున్నట్లు, విక్రయిస్తున్నట్లుగాని సమాచారం తెలిస్తే వెంటనే ఈ నెంబర్ కు (8712656392) సమాచారం తెలిపాలని సూచించారు.

మీ ఏమైనా సమాచారం తెలిస్తే నంబర్ ను గోప్యంగా ఉంచుతామని వారికి కౌన్సెలింగ్ ఇస్తామని అన్నారు.గంజాయి మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రతి ఒక్కరు సహకరించాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది కానిస్టేబుల్ భూమయ్య.రాజశేఖర్, కాసిం హోంగార్డు వెంకటి మనోహర్, గ్రామస్తులు తదితరులు ఉన్నారు.

బంగారు చీర..సిరిసిల్ల చేనేత కళాకారుడి అద్భుత ఆవిష్కరణ
Advertisement

Latest Rajanna Sircilla News