మాములుగా అయితే థియేటర్ దగ్గర పోటీ నెలకొన్న సందర్భాలు చూసే ఉంటాం.స్టార్ హీరో సినిమాలు ఎప్పుడు బాక్సాఫీస్ దగ్గర పోటీ పడుతూనే ఉంటాయి.
ఎంత పోటీ లేకుండా రిలీజ్ చేద్దామని అనుకున్న పండగ సీజన్స్ అప్పుడు మాత్రం ఎవరో ఒకరికి పోటీ కాక తప్పదు.అయితే ఇప్పుడు బిగ్ స్క్రీన్ మీదనే కాదు.
డిజిటల్ స్క్రీన్ మీద కూడా పోటీ పడుతున్నారు ఇద్దరు స్టార్స్.
తాజాగా విడుదల అయినా ఇద్దరి స్టార్ హీరో సినిమాలు ఇప్పుడు డిజిటల్ ప్రీమియర్ కు రెడీ అయ్యాయి.
ఒకేరోజు ఈ రెండు భారీ సినిమాలు ఓటిటి లో ప్రీమియర్ కు సిద్ధం అవుతున్నాయి.ఇప్పుడు నాని వర్సెస్ బాలయ్య అనిపించేలా ఈ వార్ సాగబోతోంది.
రెండు భారీ సినిమాలు వేరు వేరు ఓటిటి ప్లాట్ ఫామ్ మీద ఒకేరోజు విడుదల అవ్వడానికి రెడీ అవుతుండడంతో ఇప్పుడు ఓటిటి లో కూడా సందడి నెలకొంది.
నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన అఖండ సినిమా డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ డూపర్ హిట్ అయ్యి బాలయ్య కెరీర్ లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది.చాలా రోజుల తర్వాత బాలయ్య సినిమా ఇంతటి ఘన విజయాన్ని సాధించడం తో నందమూరి అభిమానులు ఫుల్ ఖుషీగా ఉన్నారు.
ఇక న్యాచురల్ స్టార్ నాని నటించిన కొత్త సినిమా శ్యామ్ సింగరాయ్ డిసెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.ఈ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం సాధించి చాల రోజుల తర్వాత నాని కి మంచి హిట్ లభించింది.ఇక ఇప్పుడు ఈ రెండు సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ కు రెడీ అవుతున్నాయి.జనవరి 21న నెట్ ఫ్లిక్స్ లో నాని శ్యామ్ సింగ రాయ్ స్ట్రీమింగ్ అవ్వబోతుండగా.
అదే రోజున బాలయ్య అఖండ సినిమా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కాబోతుంది.ఈ రెండు సినిమాలు ఒకేరోజు స్ట్రీమింగ్ అయ్యి ఇక్కడ కూడా పోటీ పడనున్నాయి.