గత సంవత్సరం వ్యభిచారం కేసులో అరెస్టు అయ్యి, కొన్ని రోజులు పోలీసుల అదుపులో ఉన్న శ్వేత బస్సు ప్రసాద్ నిర్దోషి అంటూ కోర్టు తేల్చి చెప్పిన విషయం తెల్సిందే.ఆ విషయం పక్కన పెడితే ఈమె ఐటెం సాంగ్ చేసిన ‘ఇంటిలిజెన్స్ ఇడియట్స్’ సినిమా విడుదలకు సిద్దం అయ్యింది.
ఈ సినిమాను శ్వేత బస్సుతో ప్రచారం చేయిస్తే పబ్లిసిటీ బాగా వస్తుందని నిర్మాతలు భావించి, ఆమెను హైదరాబాద్ రప్పించి, మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సందర్బంగా మీడియా వారు ఈమెపై అనేక ప్రశ్నలు గుప్పించి ఆమె మనస్సు నొచ్చుకునేలా చేశారు.
మీడియా సమావేశంలో ఒక విలేకరి మీరు వ్యభిచారం కేసులో అరెస్టు అయ్యి, విడుదల అయిన తర్వాత సినిమా ఆఫర్లు ఎలా వస్తున్నాయంటూ అడిగాడు.దాంతో ఆమె అతడిపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
సినిమా గురించి మాట్లాడుతాను తప్ప, ఇతర విషయాల గురించి ఇప్పుడు మాట్లాడే ఆసక్తి లేదంటూ చెప్పుకొచ్చింది.ఈ సినిమాలో తాను ఒక భాగం కనుక తనను ప్రమోషన్కు పిలిచారని, అంతే తప్ప మరే ఉద్దేశ్యం ఏం లేదని చెప్పుకొచ్చింది.
ప్రస్తుతం తాను ఏ సినిమాలో నటించడం లేదని, హిందీలో రెండు తెలుగులో మంచు విష్ణు సినిమాలో చేయాల్సి ఉందని పేర్కొంది.