బాలీవుడ్ ఇండస్ట్రీలోని సీరియల్ నటీమణులలో ఒకరైన షగుప్త అలీ గత కొంతకాలం నుంచి తీవ్ర ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారు.ఒకవైపు ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న షగుప్త అలీకి మరోవైపు తీవ్ర అనారోగ్య సమస్యలు వేధిస్తున్నాయని తెలుస్తోంది.
కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ వల్ల ఈ నటికి ఉపాధి కూడా కరువైందని సమాచారం.ప్రస్తుతం ఈ నటి దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నారు.
అయితే తనకు సహాయం చేయమని ఈ నటి నెటిజన్లను కోరుతుండటం గమనార్హం. ఒక ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ నటి తన కష్టాలను చెప్పుకొచ్చారు.20 సంవత్సరాల క్రితం బ్రెస్ట్ క్యాన్సర్ కు తాను చికిత్స చేయించుకున్నానని అయితే ఇప్పటికి కూడా తనను అనారోగ్య సమస్యలు వేధిస్తున్నాయని ఆమె చెప్పుకొచ్చారు.వైద్య చికిత్స కొరకు కారుతో పాటు బంగారు నగల్ని కూడా అమ్మేశానని ఆమె తెలిపారు.
30 సంవత్సరాలుగా నటిగా తాను ఎంతో మంచి జీవితం గడిపానని అయితే ఆఫర్లు రాకపోవడం వల్ల ప్రస్తుతం దుర్భరమైన జీవితం గడపాల్సి వస్తోందని ఆమె చెప్పుకొచ్చారు.వైద్య చికిత్స కోసం ఆస్పత్రికి వెళ్లడానికి కూడా తాను ఆటోనే ఆశ్రయిస్తున్నానని నటి అన్నారు.సోనూసూద్ ను సంప్రదించి సోనూసూద్ ద్వారా సహాయం పొందాలని షగుప్త అలీ భావించగా సోనూసూద్ ఆర్థిక సాయం చేయరని తెలిసి ఆ ఆలోచనను విరమించుకున్నారు.
సినిమాలకు, టీవీలకు సంబంధించిన సింటా నటికి సాయం చేయాలని భావించగా వాళ్లు తక్కువ మొత్తం ఇవ్వాలని అనుకోవడంతో షగుప్త అలీ వాళ్ల సాయాన్ని తీసుకోవడానికి ఇష్టపడలేదు.ఎవరైనా తనకు ఆర్థిక సహాయం చేయాలని తనకు ఆర్థికపరమైన సహాయం ఎంతో అవసరమని ఆమె తెలిపారు.షగుప్తా అలీకి నెటిజన్లు తమ వంతు సహాయం చేస్తారేమో చూడాల్సి ఉంది.