భారత్ క్రికెట్ టీంలో ఓపెనర్ శుభ్ మన్ గిల్ వరుస పెట్టి సెంచరీలు బాదుతున్నాడు.ప్రస్తుతం న్యూజిలాండ్ తో జరుగుతున్న సిరీస్ లో వన్డే మ్యాచ్ లలో డబల్ సెంచరీ.
చేసిన శుభ్ మన్ గిల్.తాజాగా మూడో టి20 మ్యాచ్ లో సెంచరీ సాధించాడు.
దీంతో 23 సంవత్సరాల వయసులోనే సెంచరీ చేయటంతో అతి తక్కువ వయసులో ఇండియా టీంలో ఈ ఫీట్ అందుకున్న ప్లేయర్ గా రికార్డు క్రియేట్ చేశాడు.
ముఖ్యంగా టి20లో సెంచరీ చేసిన యంగెస్ట్ ఇండియన్ గా శుభ్ మన్ గిల్ సరికొత్త ఫీట్ అందుకున్నాడు.అంతేకాదు టి20 లలో భారత్ తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోర్ కూడా మనోడు పేరిటే ఉంది. 63 బంతులలో 7 సిక్సర్లు, 12 ఫోర్ లతో 126 రన్స్ చేసి నాటౌట్ గా నిలిచాడు.
దీంతో భారత్ 234 భారీ స్కోరు చేయడం జరిగింది.సరిగ్గా వరల్డ్ కప్ టోర్నీకి ముందు గిల్ ఆడుతున్న ఆట తీరు పట్ల భారత్ క్రికెట్ ప్రేమికులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.