తెలుగులో ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన “గబ్బర్ సింగ్” చిత్రంలో హీరోయిన్ గా నటించి ప్రేక్షకులను కట్టిపడేసిన తమిళ బ్యూటీ “శృతి హాసన్” గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు.అయితే నటి శృతి హాసన్ గబ్బర్ సింగ్ చిత్రంలో నటించడానికంటే ముందుగా పలు, కోలీవుడ్, బాలీవుడ్, చిత్రాలలో హీరోయిన్ గా నటించినప్పటికీ ఈ అమ్మడికి పెద్దగా గుర్తింపు లభించలేదు.
కానీ గబ్బర్ సింగ్ చిత్రం మంచి హిట్ కావడంతో ఈ అమ్మడి సినీ కెరీర్ ఒక్కసారిగా మలుపు తిరిగింది.కాగా ప్రస్తుతం శృతి హాసన్ ఒక్కో చిత్రానికి 2 కోట్ల నుంచి 5 కోట్ల రూపాయల వరకు పారితోషికం అందుకుంటోంది.
అయితే ఈ మధ్య కాలంలో నటి శ్రుతి హాసన్ సోషల్ మీడియా మాధ్యమాలలో బాగానే యాక్టివ్ గా ఉంటోంది.అంతే కాకుండా అప్పుడప్పుడు లైవ్ కార్యక్రమాలు మరియు చిట్ చాట్ కార్యక్రమాలు నిర్వహించి కొంతమంది నెటిజన్లు అడిగిన ప్రశ్నలకి సమాధానాలిస్తూ ఉంటోంది.కాగా తాజాగా ఓ నెటిజన్ అత్యుత్సాహం ప్రదర్శిస్తూ నీ “పెళ్లి ఎప్పుడు.?” అంటూ ప్రశ్నించాడు.దీంతో శృతి హాసన్ తనదైన శైలిలో స్పందిస్తూ తన పెళ్లి గురించి ఎక్కువగా ఆలోచిస్తూ తన బుర్ర పాడు చేసుకోవద్దని నెటిజన్ కి సూచించింది.అంతే కాకుండా తను పెళ్ళి చేసుకునే సమయంలో కచ్చితంగా అందరికీ తెలియజేసి మరీ పెళ్లి చేసుకుంటానని కాబట్టి ఆ విషయంలో పెద్దగా కంగారు పడొద్దని సరదాగా రిప్లై ఇచ్చింది.
దీంతో ఒక్కసారిగా నెటిజన్ ఖంగు తిన్నాడు.
అయితే ఈ విషయం ఇలా ఉండగా పలు వ్యక్తిగత కారణాల వల్ల శృతి హాసన్ దాదాపుగా మూడు సంవత్సరాలుగా సినిమా ఇండస్ట్రీకి దూరమైంది.కానీ ఇటీవలే తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన “వకీల్ సాబ్” చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించి మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చింది.కాజా ఇటీవలే ఈ అమ్మడు తెలుగులో రెబల్ స్టార్ “ప్రభాస్” హీరోగా నటిస్తున్న “సలార్” చిత్రంలో హీరోయిన్ గా నటించే అవకాశం దక్కించుకుంది.
అయితే ఈ చిత్రం కోసం శృతి హాసన్ దాదాపుగా 15 కోట్ల రూపాయలకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం.