సౌత్ సినిమాలలో కథానాయికగా శృతి హసన్ మళ్ళీ తన హవాని కొనసాగించడం మొదలు పెట్టింది.ఆ మధ్య ప్రేమలో పడి రెండేళ్ళు పూర్తిగా సినిమాలు పక్కన పెట్టి విదేశాలలో ప్రియుడుతో గడపడానికి సమయం కేటాయించిన ఈ అమ్మడు అతనికి బ్రేక్ అప్ చెప్పి మళ్ళీ కొత్త జీవితం స్టార్ట్ చేసింది.
ఈ సారి మరింత బెటర్ గా తన టాలెంట్ ని చూపించుకోవడానికి రెడీ అయ్యి ఒక యుట్యూబ్ చానల్ స్టార్ట్ చేసి అందులో తాను మ్యూజిక్ కంపోజ్ చేసి పాడిన సాంగ్స్ ని ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తుంది.ఇప్పటికే ఎడ్జ్ అనే ఒక సాంగ్ తో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
తాజాగా మరో సాంగ్ కూడా ఈ భామ రిలీజ్ చేసింది.ఇదిలా ఉంటే మరో వైపు హీరోయిన్ కూడా వరుస అవకాశాలతో దూసుకుపోతుంది.
ఇప్పటికే తెలుగులో వకీల్ సాబ్, క్రాక్ సినిమాలలో హీరోయిన్ గా శృతి హసన్ చేస్తుంది.ఈ సినిమాలలో క్రాక్ ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకొని రిలీజ్ కి రెడీ అయ్యి ఉంది.
మరో వైపు తమిళంలో లాభం అనే సినిమాలో విజయ్ సేతుపతికి జోడీగా నటిస్తుంది.తాజాగా మరో సినిమాకి ఈ అమ్మడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
తమిళ స్టార్ హీరో శింబు త్వరలో మిస్కిన్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నాడు.ఈ సినిమాలో హీరోయిన్ గా శృతి హసన్ కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తుంది.
ఇప్పటికే ఈ సినిమా ప్రారంభం కావాల్సి ఉన్న కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తుంది.ప్రస్తుతం శింబు మహా, మానాడు అనే సినిమాలు కంప్లీట్ చేసి రిలీజ్ కి సిద్ధం చేశాడు.
కరోనా పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చిన తర్వాత ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళే అవకాశం ఉందని తెలుస్తుంది.