దక్షిణాది సినీ ఇండస్ట్రీలో ఇంత మంచి గుర్తింపును సంపాదించుకున్న నటీమణులలో శృతిహాసన్ ఒకరు.ఈమె మెగా కాంపౌండ్ లోని ముగ్గురు హీరోలతో జత కట్టి బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది.
ఈ క్రమంలోనే మరోసారి మెగా కాంపౌండ్ నుంచి మరొక స్టార్ హీరోతో జతకట్టనుందని తెలుస్తోంది.మెగాస్టార్ చిరంజీవి తన రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించిన తర్వాత వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు.
ఈ క్రమంలోనే ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో “ఆచార్య” సినిమాలో నటిస్తున్నారు.
ఈ సినిమా తరువాత తమిళనాడులో సూపర్ హిట్ చిత్రంగా నిలిచినటువంటి “వేదాళం” సినిమాను మెగాస్టార్ తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే.
అజిత్ పోషించిన ఈ పాత్రను తెలుగులో మెగాస్టార్ చేయనున్నారు.ఈ చిత్రంలో చిరంజీవి చెల్లెలి పాత్రలో మహానటి కీర్తిసురేష్ నటిస్తున్నట్లు వార్తలు వినిపించాయి.ఇకపోతే ఈ సినిమాలో మెగాస్టార్ సరసన శృతిహాసన్ నటిస్తున్నట్లు తాజా సమాచారం.
ఇప్పటికే దర్శకుడు రమేష్ మెహర్ నటి శృతి హాసన్ ను కలిసి ఆమెతో సంప్రదింపులు చేసినట్లు సమాచారం.మరి ఈ బ్యూటీ మెగాస్టార్ తో జత కట్టడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా.? లేదా .?అనే విషయం గురించి మరి కొద్ది రోజులలో క్లారిటీ రానుందని తెలుస్తోంది.రవితేజ “క్రాక్” సినిమా ద్వారా మళ్లీ ఫామ్ లోకి వచ్చిన శృతిహాసన్ కేజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటిస్తున్నటువంటి “సలార్” సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు.