తమిళ బ్యూటీ శృతి హాసన్ కొంత గ్యాప్ తరువాత సినిమాల్లో రీఎంట్రీ ఇస్తోన్న సంగతి తెలిసిందే.తెలుగులో మాస్ రాజా రవితేజ సరసన క్రాక్ చిత్రంతో ఇప్పుడు రీఎంట్రీ ఇస్తోన్న శృతి హాసన్ ఈ సినిమాతో అదిరిపోయే హిట్ కొట్టి కమ్బ్యాక్ ఇవ్వాలని చూస్తోంది.
ఇక ఈ సినిమా అందించే హిట్తో వరుసబెట్టి సినిమాలు చేయాలని ఈ బ్యూటీ భావిస్తోంది.కాగా ఈ సినిమా తరువాత శృతి చేతిలో ఇప్పటికే పలు సినిమాలు కూడా ఉన్నాయి.
అయితే ఈ బ్యూటీ తన మనసులోని కోరికను తాజాగా బయటపెట్టింది.
బాలీవుడ్లో ప్రస్తుతం రెండు ప్రాజెక్టులు చేతులో ఉండగా, తమిళంలో విజయ్ సేతుపతితో కలిసి ఓ చిత్రంలో కూడా అమ్మడు నటిస్తోంది.
ఇక తనకు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే చాలా ఇష్టమని, ఒక్కసారైనా ఆయనతో నటించాలని ఉందంటూ శృతి తన మనసులోని మాటను బయటపెట్టేసింది.నేషనల్ లెవెల్లో మంచి గుర్తింపు ఉన్న శృతి హాసన్, ఇలా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్తో సినిమా చేయాలనుకుంటుందనే వార్తతో సినీ వర్గాలు ఒకింత ఆశ్చర్యానికి గురయ్యాయి.
అయితే ప్రస్తుతం ఆమె సరైన ఫాంలో లేదని, అందుకే ఆమె కోరిక ఇప్పట్లో తీరకపోవచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ఏదేమైనా ప్రభాస్ క్రేజ్ను దృష్టిలో పెట్టుకుని శృతి ఇలాంటి కామెంట్ చేసుంటుందని విశ్లేషకులు అంటున్నారు.
ఒకవేళ క్రాక్ చిత్రం అనుకున్నట్లుగానే హిట్ అయితే శృతి హాసన్కు మరిన్ని సినిమా ఛాన్సులు వచ్చే అవకాశం ఉందని వారు అంటున్నారు.ఈ బ్యూటీకి క్రాక్ చిత్రం ఎలాంటి విజయాన్ని అందిస్తుందో తెలియాలంటే మాత్రం సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే అంటున్నారు ప్రేక్షకులు.
అటు ప్రభాస్ ప్రస్తుతం రాధేశ్యామ్ చిత్రాన్ని రిలీజ్కు రెడీ చేస్తుండగా, నాగ్ అశ్విన్ డైరెక్షన్లో ఓ సినిమా, ఆదిపురుష్, సలార్ చిత్రాలను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.