కాటమరాయుడు సినిమా తరువాత తెలుగు తెరకు దూరమైన శృతిహాసన్ రీఎంట్రీలో మళ్లీ వరుస అవకాశాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.ప్రస్తుతం శృతి చేతిలో వకీల్ సాబ్, సలార్ సినిమాలు ఉండగా మరికొన్ని సినిమాల్లో కూడా శృతిహాసన్ నటిస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
ఎంతోమంది స్టార్ హీరోలతో కలిసి నటించిన శృతిహాసన్ ఒక హీరో అంటే మాత్రం తనకు ఎంతో ప్రత్యేకం అని చెబుతున్నారు.
బలుపు, క్రాక్ సినిమాలలో రవితేజతో కలిసి నటించిన శృతి రవితేజ అందరితో సరదాగా కలిసిపోతారని పేర్కొన్నారు.
రవితేజలో అహంభావం ఉండదని.తనకు రవితేజ ప్రత్యేకం అని శృతిహాసన్ తెలిపారు.
మాస్ మహరాజ్ కు తన హృదయంలో ప్రత్యేక స్థానం ఉందని శృతిహాసన్ అన్నారు.రవితేజ, శృతిహాసన్ జంటగా నటించిన రెండు సినిమాలు హిట్లు కావడం విశేషమైతే ఈ రెండు సినిమాలకు దర్శకుడు ఒకరే కావడం గమనార్హం.
మరోవైపు శృతిహాసన్ పిట్ట కథలు అనే వెబ్ సిరీస్ లో నటించగా ఆ వెబ్ సిరీస్ ఈరోజు నుంచి స్ట్రీమింగ్ కానుంది.నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానున్న ఈ వెబ్ సిరీస్ పై ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు ఉన్నాయి.క్రాక్ సక్సెస్ శృతిహాసన్ కు కూడా మంచి పేరు తెచ్చింది.ఫ్లాపుల్లో ఉన్న రవితేజకు ఈ సినిమాతో సక్సెస్ దక్కింది.మరోవైపు శృతి గెస్ట్ రోల్ లో నటించిన వకీల్ సాబ్ సినిమా ఏప్రిల్ 9న విడుదల కానుంది.
పింక్ రీమేక్ గా వకీల్ సాబ్ సినిమా తెరకెక్కనుండగా ఈ సినిమా కథను తెలుగు నేటివిటీకి అనుగుణంగా మార్పులు చేశారు.
పవన్ కళ్యాణ్ రీఎంట్రీ సినిమా కావడంతో కమర్షియల్ గా అన్ని అంశాలు పుష్కలంగా ఉండేలా వకీల్ సాబ్ మూవీ దర్శకనిర్మాతలు భావిస్తున్నారు.ఈ సినిమాతో శృతి మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంటారేమో చూడాల్సి ఉంది.