టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి 10 సంవత్సరాలు అయినా ఇండస్ట్రీలో శృతిహాసన్ హవా ఏ మాత్రం తగ్గడం లేదు సరికదా అంతకంతకూ పెరుగుతోంది.ఇప్పటికే క్రాక్ తో ఒక బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకున్న శృతిహాసన్ వకీల్ సాబ్ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకుంటారని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
ఈ నెల 9వ తేదీన విడుదల కానున్న వకీల్ సాబ్మూవీలో శృతిహాసన్ గెస్ట్ రోల్ లో చేశారు.
వకీల్ సాబ్ మూవీలోని పాత్ర తనకు మంచి పేరును సంపాదించి పెడుతుందని శృతిహాసన్ భావిస్తున్నారు.
తెలుగు, తమిళ భాషల్లోని సినిమాల్లో ఎక్కువగా నటిస్తున్న శృతి చెన్నై, హైదరాబాద్ మధ్య తరచూ ప్రయాణాలు చేస్తున్న విషయం తెలిసిందే.కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో కరోనా సోకకుండా తీసుకుంటున్న జాగ్రత్తలకు సంబంధించి శృతిహాసన్ కీలక విషయాలను వెల్లడించారు.
ప్రస్తుతం నటిస్తున్న సినిమా షూటింగ్ ల కొరకు ఇతర ప్రాంతాలకు తరచూ ప్రయాణాలు చేస్తున్నానని ప్రయాణాలు చేసే సమయంలో నెలకొనే గందరగోళం వల్ల తాను తరచూ కరోనా పరీక్షలు చేయించుకుంటున్నానని ఆమె అన్నారు.తాను ఇతర రాష్ట్రాలకు వెళితే ఆయా రాష్ట్రాల ప్రోటోకాల్ తో పాటు ఆయా రాష్ట్రాల భద్రతా చర్యలను కూడా పాటిస్తానని శృతిహాసన్ వెల్లడించడం గమనార్హం.
తన వల్ల ఇతరులు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇబ్బంది పడకూడదని తాను భావిస్తానని ఆమె పేర్కొన్నారు.మాస్కును ధరించే విషయంలో శానిటైజర్ ను వినియోగించే విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడనని ఆమె తెలిపారు.
సలార్ సినిమాలో ప్రభాస్ కు జోడీగా నటిస్తున్న శృతిహాసన్ కెరీర్ ను బాగా ప్లాన్ చేసుకుంటున్నారు.సలార్ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుండగా కేజీఎఫ్ సిరీస్ సినిమాల డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.