యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఇప్పటికే షూటింగ్ ముగించుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది.ఈ సినిమాను ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
కాగా ఈ సినిమా రిలీజ్ కాకముందే ప్రభాస్ తన నెక్ట్స్ మూవీని పట్టాలెక్కిస్తున్నాడు.ఈ క్రమంలోనే కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో సలార్ అనే చిత్రాన్ని ప్రభాస్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.
పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీగా సలార్ చిత్రాన్ని ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమాలో ప్రభాస్ అల్టిమేట్ మాస్ అవతారంలో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు రెడీ అవుతున్నాడు.
కాగా ఈ సినిమాలో ప్రభాస్ సరసన హీరోయిన్గా అందాల భామ శృతి హాసన్ ఎంపికైన సంగతి తెలిసిందే.ఇటీవల మాస్రాజా రవితేజ సరసన క్రాక్ చిత్రంలో నటించిన శృతి, ఆ సినిమా ఇచ్చిన సక్సెస్తో ఇప్పుడు సలార్లోనూ రెచ్చిపోయి యాక్టింగ్ చేసేందుకు రెడీ అవుతోంది.
అయితే ఈ సినిమా కోసం శృతి హాసన్ భారీగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
సలార్ చిత్రం కోసం ఏకంగా రూ.1 కోటి డిమాండ్ చేసిందట ఈ బ్యూటీ.దీనికి క్రాక్ సక్సెస్ను కారణంగా చూపిస్తోందట.
ఆమె కేమియో రోల్లో నటించిన వకీల్ సాబ్ చిత్రం కూడా రిలీజ్కు రెడీగా ఉండటంతో, సలార్లో నటించేందుకు ఇంత భారీమొత్తాన్ని శృతి డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది.ఏదేమైనా ప్రభాస్ లాంటి స్టార్ హీరో పక్కన చేస్తున్న కారణం, తాను నటించిన క్రాక్ చిత్రం బ్లాక్బస్టర్ హిట్ కావడంతో శృతి ఇంతమేర రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఇక చిత్ర యూనిట్ కూడా ఆమె డిమాండ్కు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.కాగా ప్రస్తుతం గోదావరిఖని ప్రాంతంలో ఈ సినిమా షూటింగ్ జరుగుతోన్న సంగతి తెలిసిందే.