హిందీ సినిమా లక్ తో హీరోయిన్ గా సినీ రంగంలోకి అడుగుపెట్టిన శృతి హాసన్ తెలుగు, తమిళం, హిందీ భాషల్లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది.చేసింది తక్కువ సినిమాలే అయినా స్టార్ హీరోల సరసన అవకాశాలు రావడంతో బ్లాక్ బస్టర్ హిట్లను తన ఖాతాలో వేసుకుంది.
గబ్బర్ సింగ్, రేసుగుర్రం, శ్రీమంతుడు, ఎవడు సినిమాలు హీరోయిన్ గా శృతి హాసన్ కు మంచి పేరు తెచ్చిపెట్టాయి.
రవితేజకు జోడీగా గతంలో బలుపు సినిమాలో నటించిన శృతిహాసన్ ప్రస్తుతం రవితేజతో క్రాక్ అనే సినిమాలో నటిస్తోంది.
కమల్ హాసన్ కూతురు కావడంతో ఇండస్ట్రీలో అవకాశాలు సులువుగానే వచ్చినా తన ప్రతిభతో సినిమా సినిమాకు పరిణతి చూపిస్తూ శృతి హాసన్ మంచి నటిగా ఎదిగింది.లాక్ డౌన్ వల్ల ఇంటికే పరిమితమైన శృతి హాసన్ సోషల్ మీడియా ద్వారా అభిమానుల ప్రశ్నలకు సమాధానాలు చెబుతోంది.
నెటిజన్లతో శృతి ముచ్చటిస్తూ తనకు ఒంటరితనం ఇష్టమని, ఇంట్లో ఒంటరిగా ఉండటానికే ఇష్టపడతానని పేర్కొంది.గడిచిన కొన్నేళ్ల నుంచి తాను ఒంటరిగానే ఉంటున్నానని ఇంట్లో అన్ని పనులు ఒక్కదానినే చేసుకుంటానని ఇతరులపై ఆధారపడటం తనకు నచ్చదని శృతిహాసన్ తెలిపింది.
లాక్ డౌన్ టైమ్ లో వంట పాత్రలు కడిగే పోటీలో పాల్గొంటారా.? అని కొందరు సవాల్ విసిరారని.అలాంటి పనులు చేసుకోవడం మన బాధ్యత అని కామెంట్లు చేసింది.
బీ ద రియల్ మ్యాన్ ఛాలెంజ్ పేరుతో లాక్ డౌన్ సమయంలో చాలామంది టాలీవుడ్ స్టార్ హీరోలు, దర్శకులు ఛాలెంజ్ నిర్వహించగా శృతిహాసన్ వారిపై పరోక్షంగా సెటైర్లు వేయడం గమనార్హం.
ఈ ఛాలెంజ్ లో చిరంజీవి, రాజమౌళి, వెంకటేష్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, సందీప్ రెడ్డి వంగా లాంటి స్టార్స్ పాల్గొన్నారు.