టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతూ సడెన్ గా రెండేళ్లు సినిమాలకి గ్యాప్ ఇచ్చేసిన అందాల భామ శృతి హాసన్.ఈ రెండేళ్లలో సినిమాలు పక్కన పెట్టిన తనకి ఇష్టమైన మ్యూజిక్ తో ట్రావెల్ చేస్తూ వివిధ దేశాలలో కాన్సర్ట్స్ కూడా చేసింది.
అదే సమయంలో తాను ప్రేమించిన బాయ్ ఫ్రెండ్ కి ఏ కారణంగానో బ్రేక్ అప్ చెప్పేసింది.రెండేళ్ల గ్యాప్ తర్వాత రవితేజ క్రాక్ మూవీ ఒకే చేసింది.
ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ అయిపొయింది.అలాగే ప్రస్తుతం ఈ అమ్మడు పవన్ కళ్యాణ్ కి జోడీగా వకీల్ సాబ్ సినిమాలో కూడా నటించబోతుంది.
ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే జరుగుతుంది.లాక్ డౌన్ కారణంగా ఇప్పటికే రిలీజ్ కావాల్సిన ఈ సినిమా ఇంకా షూటింగ్ దశలోనే ఉంది.
మరో వైపు పవన్ కళ్యాణ్ అటు రాజకీయాలు, ఇటు సినిమాలు అంటూ ట్రావెల్ చేయడం వలన రెగ్యులర్ షూటింగ్ చేయడం కుదరడం లేదు.రీసెంట్ గా మళ్ళీ ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యింది.
పవన్ కళ్యాణ్ కూడా కొన్ని రోజులు ఈ సినిమా షూటింగ్ లో పాల్గొన్నాడు.మరల పార్టీ క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమంకి శ్రీకారం చుట్టడంతో కార్యకర్తలని, నాయకులని మోటివేట్ చేసే పనిలో పడ్డాడు.
అదే సమయంలో త్వరలో తిరుపతి లోక్ సభ ఎన్నికలు జరగనున్న నేపధ్యం దానిపై కసరత్తు చేస్తున్నాడు.దీంతో మళ్ళీ షూటింగ్ కి విరామం ఇచ్చారు.ఇదిలా ఉంటే తాజాగా శృతి హాసన్ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తో ముచ్చటిస్తూ వకీల్ సాబ్ షూటింగ్ గురించి కొన్ని విషయాలు పంచుకుంది.జనవరి నుంచి తాను వకీల్ సాబ్ షూటింగ్ లో జాయిన్ కాబోతున్నానని చెప్పింది.
పవన్ కళ్యాణ్ తో మూడో సినిమా చేస్తూ ఉండటం సంతోషంగా ఉందని చెప్పుకొచ్చింది.అలాగే వకీల్ సాబ్ లాంటి విమెన్ సెంట్రిక్ కథాంశం ఉన్న చిత్రంలో నటించడం కూడా చాలా ఆనందంగా ఉందని అభిమానులతో తన ఆలోచనలు పంచుకుంది.