కమల్ హాసన్ కూతురిగా సినీ ప్రవేశించిన శృతిహాసన్ మొదట చేసిన కొన్ని సినిమాలు విడుదల కాకపోవడం, విజయవంతం కాకపోవడంతో ఐరన్ లెగ్ గా ముద్ర వేసే ప్రయత్నం చేశారు.అయితే అందరి అంచనాలను తలకిందులు చేసి ప్రస్తుతం స్టార్ హీరోయిన్ గా ఒక్క వెలుగు వెలుగుతోంది.
శృతిహాసన్ ఓవర్ నైట్ స్టార్ కావడానికి దోహదపడ్డ సినిమా గబ్బర్ సింగ్.గబ్బర్ సింగ్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ తో ఒక్కసారిగా శృతిహాసన్ కెరీర్ మారిపోయిందని చెప్పవచ్చు.
అయితే తాజాగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పై శృతిహాసన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.అయితే పవన్ కళ్యాణ్ కు యువతలో పెద్ద ఎత్తున క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే.
అయితే పవన్ ఫ్యాన్స్ ఎక్కువగా యువత ఉన్న దృష్ట్యా మహిళల సంరక్షణపై ఇలా ఏదో ఒక సామాజిక సందేశం రూపంలో పవన్ కళ్యాణ్ చెబితే అది అతి పెద్ద మార్పుకు దారి తీస్తుందని శృతిహాసన్ చెప్పుకొచ్చింది.అయితే ప్రస్తుతం వకీల్ సాబ్ సినిమాలో పవన్ నటిస్తున్నాడు.
అయితే ఇందులో మహిళల గొప్పతనాన్ని చూపించనున్నట్లు తెలుస్తోంది.ఏది ఏమైనా శృతి హాసన్ పవన్ కు ఇచ్చిన సలహా సహేతుకమని చెప్పవచ్చు.
పవన్ సందేశం వల్ల ఎంతో కొంత మంచి జరిగే అవకాశం ఉంది,.