ప్రస్తుతం ఓటీటీలకు మంచి డిమాండ్ ఉండటం చేత ఎంతో మంది స్టార్ హీరో హీరోయిన్లు కూడా వెబ్ సిరీస్ లో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.ఇప్పటికే పలువురు స్టార్ హీరోయిన్లు వెబ్ సిరీస్ లో నటించారు.
ఇదిలా ఉండగా తాజాగా బాలీవుడ్ సీనియర్ నటుడు మిథున్ చక్రవర్తి ఒక సిరీస్ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.ఈ సందర్భంగా నటుడు మిథున్ చక్రవర్తి మాట్లాడుతూ తన జీవితంలో ఇది ఒక కొత్త అధ్యాయం అని తెలిపారు.
తనతో పాటు స్టార్ హీరోయిన్ శృతి హాసన్ కూడా ఒరిజినల్ సిరీస్ లో నటిస్తున్నట్లు ఈయన వెల్లడించారు.అమెజాన్ ఒరిజినల్ గా వస్తున్నటువంటి ఈ సిరీస్ లో నటించే అవకాశం రావడంతో కాదనలేకపోయానని ఈ సందర్భంగా మిథున్ చక్రవర్తి తెలిపారు.
ఇందులో శృతి హాసన్ ఒక సీక్రెట్ ఏజెంట్ గా నటించబోతుందని ఈ కథ మొత్తం తన చుట్టూ తిరుగుతుందని మేకర్స్ వెల్లడించారు.
ప్రముఖ రచయిత సుబ్రమణియన్ నవల ది బెస్ట్ సెల్లర్ షీ రాట్ ఆధారంగా ఈ సిరీస్ కు ముకుల్ దర్శకత్వం వహించగా సిద్ధార్థ మల్హోత్రా కీర్తి నిర్మాణంలో ఈ సిరీస్ తెరకెక్కుతుంది.ఇక త్వరలోనే షూటింగ్ ప్రారంభం అవుతుందని తెలిపారు.ఇక శృతి హాసన్ విషయానికి వస్తే ప్రస్తుతం ఈమె బాలకృష్ణ సరసన గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తున్నారు అదేవిధంగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ సలార్ చిత్రంతో బిజీగా ఉన్నారు.