పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ వకీల్ సాబ్ ఇప్పటికే మెజారిటీ శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే.ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
కాగా ఈ సినిమాలో పవన్ సరసన హీరోయిన్ పాత్రలో నటించేందుకు ఓ స్టార్ బ్యూటీని తీసుకుంటారని చిత్ర యూనిట్ గతంలోనే వెల్లడించింది.
కాగా ఇటీవల ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్గా నటిస్తోందని, అందుకే ఆమె హైదరాబాద్కు మకాం మార్చిందనే వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది.
కాగా ఈ సినిమాలో తన పాత్ర కోసం శృతి హాసన్ భారీగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు వార్తలు కూడా వచ్చాయి.అయితే ఈ వార్తలపై శృతి హాసన్ స్పందించినట్లు తెలుస్తోంది.
ఈ సినిమాలో తన పాత్రను చాలా కుదించినట్లు తెలియడంతో, ఇప్పట్లో ఆమె తక్కువ ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటించబోనని చిత్ర యూనిట్కు తేల్చి చెప్పిందట.కేమియో తరహా పాత్రల్లో నటించడం తనకు ఇష్టం లేదని వకీల్ సాబ్ దర్శకుడికి చెప్పడంతో వారు తీవ్ర నిరాశకు లోనైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఏదేమైనా చివరి దశకు చేరుకున్న వకీల్ సాబ్ చిత్రానికి ఇది గట్టి ఎదురుదెబ్బ అని అంటున్నారు సినీ వర్గాలు.ఈ సినిమాను వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేస్తుండగా దిల్ రాజు ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నాడు.
మరి ఈ సినిమాలో శృతి నిజంగానే నటించడం లేదా అనేది తెలియాలంటే మాత్రం సినిమా యూనిట్ అఫీషియల్గా అనౌన్స్ చేయాల్సిందే.