కాటమరాయుడు లో చివరి గా నటించిన ప్రపంచ స్టార్ కమల్ హాసన్ గారాల పట్టి శృతి హాసన్ మళ్లీ తెలుగులోకి రీ ఎంట్రీ ఇవ్వబోతుంది.అయితే ఈ రీ ఎంట్రీ మాస్ మహారాజ్ రవి తేజ పక్కన రీ ఎంట్రీ ఇవ్వబోతుంది ఈ ముద్దు గుమ్మ.
దాదాపు రెండేళ్ళ నుండి సినిమాలకి దూరంగా ఉన్నఈ అమ్మడు మైఖేల్ కోర్సెల్ అనే వ్యక్తితో ప్రేమాయణం నడిపిన ఈ ముద్దు గుమ్మ ఆటగాడితో చెట్టాపట్టాల్ వేసుకొని షికార్లు కూడా కొట్టింది.ఈ క్రమంలోనే ఆమె సినిమాలను సైతం పక్కన పెట్టి మరీ అతడితో తిరిగింది.
అయితే ఇటీవల వీరిద్దరి ప్రేమకి ఎండ్ కార్డ్ పడడంతో మళ్ళీ సినిమాలపై దృష్టి సారించింది .ప్రస్తుతం కోలీవుడ్లో విజయ్సేతుపతి సరసన లాభం అనే చిత్రం చేస్తున్న ఈ ముద్దు గుమ్మ అంతర్జాతీయ వెబ్ సిరీస్ లో కూడా నటిస్తుంది.అమెరికాకి చెందిన ‘ట్రెడ్స్టోన్’ అనే వెబ్ సిరీస్ లో శృతి హాసన్ కీలక పాత్ర పోషిస్తుంది.అంతర్జాతీయ వెబ్ సిరీస్గా రూపొందనున్న ట్రెడ్ స్టోన్ని రామిన్ బహ్రానీ తెరకెక్కించనున్నారు.
నీరా పటేల్ అనే పాత్రలో శృతి కనిపించనుందని తెలుస్తుంది.
అయితే 2017 లో పవన్ పక్కన చివరిగా నటించిన శృతి ఇప్పుడు టాలీవుడ్ పై కూడా దృష్టి పెట్టింది.రెండేళ్ళ తర్వాత రవితేజ 66వ చిత్రంతో తెలుగులోకి రీఎంట్రీ ఇస్తుంది.గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కనున్నట్లు తెలుస్తుంది.
అయితే ఈ చిత్రానికి సంబంధించి మరిన్ని అప్ డేట్స్ తెలియాల్సి ఉంది.