తెలుగు సినీ ఇండస్ట్రీలో ఈ మధ్య కాలంలో హీరోయిన్ లు సినిమాలో పాత్రని బట్టి రెమ్యూనరేషన్ ను ఏం చేస్తున్నారు.అంతే కాకుండా సినిమా కథ, పాత్ర కంటే రెమ్యూనరేషన్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్న విషయం కూడా తెలిసిందే.
ఇక గత రెండు సంవత్సరాలుగా చూసుకుంటే తెలుగు లో స్టార్ హీరోయిన్ల రెమ్యూనరేషన్ ఊహించని స్థాయిలో పెరిగింది.ఇక అలా రెమ్యూనరేషన్ పెంచిన వారిలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ బ్యూటీ శృతి హాసన్ కూడా ఒకరు.
శృతి హాసన్ ప్రస్తుతం చిరంజీవి, బాబి కాంబినేషన్ లో వస్తున్న సినిమాలో నటించడంతో పాటు, బాలయ్య, గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో వస్తున్న సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తోంది.
అయితే బాలయ్య సినిమాకు కోటిన్నర రూపాయల పారితోషికం తీసుకోవడానికి ఒప్పుకున్న శృతిహాసన్, మెగాస్టార్ చిరంజీవి సినిమాకు మాత్రం రెండు కోట్ల రూపాయలను డిమాండ్ చేసింది అని వార్తలు వినిపిస్తున్నాయి.మూవీ మేకర్స్ సైతం శృతిహాసన్ అడిగినంత రెమ్యునరేషన్ ఇవ్వడానికి ఓకే చెప్పారు అని వార్తలు పెద్దఎత్తున వినిపిస్తున్నాయి.సీనియర్ హీరోల సినిమాలలో వరుసగా ఆఫర్లు దక్కుతున్న నేపథ్యంలోనే శృతిహాసన్ తన రెమ్యునరేషన్ పెంచేసింది.
ఈ సినిమాలతో పాటు శృతి హాసన్ యంగ్ హీరో ప్రభాస్ నటిస్తున్న సలార్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమాలో శృతి హసన్ జర్నలిస్టు పాత్రలో నటిస్తోంది అని తెలుస్తోంది.దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన బలుపు, క్రాక్ లాంటి సినిమాలు మంచి సక్సెస్ ను సాధించాయి.ఇక ఆ రెండు సినిమాలలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే.
క్రాక్ సినిమా తో రీ ఎంట్రీ ఇచ్చిన శృతి హాసన్ ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది.శృతిహాసన్ ను విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
తన తండ్రి విశ్వనటుడు కమల్ హాసన్ వారసత్వాన్ని అంది పుచ్చుకుని వచ్చిన శృతిహాసన్ తనకంటూ ఒక ప్రత్యేకమైన మాస్ ఫాలోయింగ్ ను ఏర్పరుచుకుంది.ఈమెకు యూత్ లో విపరీతమైన క్రేజ్ ఉంది.