మాస్ రాజా రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ క్రాక్ ప్రస్తుతం షూటింగ్ చివరిదశకు చేరుకుంది.ఇటీవల ఈ సినిమాలోని ఓ పాట షూటింగ్కు సంబంధించి చిత్ర యూనిట్ గోవా వెళ్లిన సంగతి తెలిసిందే.
పూర్తి కాప్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమాను దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై రవితేజతో పాటు ఆయన అభిమానులు కూడా పూర్తి నమ్మకంతో ఉన్నారు.ఇక ఈ సినిమాలో రవితేజ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు.
కాగా ఆయన సరసన హీరోయిన్గా అందాల భామ శృతి హాసన్ నటిస్తోంది.గతంలో బలుపు చిత్రంలో రవితేజ సరసన శృతి హాసన్ హీరోయిన్గా నటించి మెప్పించింది.ఇప్పుడు మరోసారి రవితేజ సరసన నటిస్తుంటంతో ఈ సినిమాపై అమ్మడు భారీ అంచనాలు పెట్టుకుంది.ఇక రవితేజ లాంటి స్టార్ను తానెప్పుడూ చూడలేదని ఆమె అంటోంది.
ఆయనతో వర్క్ చేయడం చాలా సంతోషంగా, జాలీగా ఉంటుందని, సెట్స్లో తామిద్దరం చేసే అల్లరి ఇలా ఉంటుందని ఓ వీడియోను పోస్ట్ చేసింది ఈ బ్యూటీ.రవితేజతో కలిసి పుషప్స్ చేసే క్రమంలో ఆయన చేతిలో ఓడిపోయానంటూ శృతి హాసన్ ట్వీట్ చేసింది.
దీనికి సంబంధించిన వీడియోను శృతి హాసన్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడంతో అది వైరల్గా మారింది.ఇక ఈ సినిమాలో తన పాత్ర ప్రేక్షకులను ఇంప్రెస్ చేయడం ఖాయమని ఆమె అంటోంది.
కాగా ఈ సినిమాలో తమిళ నటులు సముత్రికరన్, వరలక్ష్మీ శరత్ కుమార్లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా బి.మధు ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నాడు.కరోనా కారణంగా వేసవిలో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా వాయిదా పడింది.
ఇప్పుడు సంక్రాంతి కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.