లాక్ డౌన్ ముందు ఫుల్ డిజాస్టర్ లో ఉంది శృతి హాసన్.కానీ లాక్ డౌన్ తర్వాత ఆమె నటించిన ‘క్రాక్’ సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ అవడంతో ఫుల్ హ్యాపీగా ఉంది శృతి.
ఈ సినిమాతో మళ్లీ హిట్ ట్రాక్ లో పడటంతో .సినిమాకి సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటోంది. ‘క్రాక్’ సినిమా విజయం సాధించడంతో హీరో రవితేజ కూడా ఫుల్ హ్యాపీగా ఉన్నాడు.అంతకుముందు చేసిన సినిమాలు వరుసగా ఫ్లాప్ అవడంతో. ‘క్రాక్’ పై చాలా ఆశలు పెట్టుకున్నాడు.అయితే సినిమా మొదటి షో నుండి పాజిటివ్ టాక్ సొంతం చేసుకోవడంతో గోపీచంద్ మలినేని తో హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసుకున్నాడు.
ఇదిలా ఉండగా శృతిహాసన్ ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటూ.పవన్ కళ్యాణ్ తో చేస్తున్న “వకీల్ సాబ్” సినిమా గురించి తెలియజేస్తూ ఆమె వేసిన ఒక డైలాగ్ పవన్ అభిమానులను కన్ఫ్యూజన్ లో పడేసింది.
మేటర్ లోకి వెళ్తే “వకీల్ సాబ్” సినిమాలో హీరోయిన్ గా శృతి హాసన్ చేస్తున్నట్లు వార్తలు ఫస్ట్ నుండి వస్తున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో తాజాగా తాను “వకీల్ సాబ్” సినిమాలో ఫుల్ లెంగ్త్ హీరోయిన్ కాదని శృతిహాసన్ తెలిపింది.
కేవలం చిన్నపాటి క్యారెక్టర్ అది కూడా గెస్ట్ రోల్ తరహాలో ఉండటంతో.పవన్ పక్కన అవకాశం రావడంతో అంగీకరించడం జరిగిందని స్పష్టత ఇచ్చింది.దీంతో పవన్ అభిమానులు సినిమాలో మరో హీరోయిన్ ఉంటుందా అనే డైలమాలో పడ్డారు.కానీ ఈ సినిమా యూనిట్ నుండి అందుతున్న సమాచారం ప్రకారం.“వకీల్ సాబ్” స్టొరీ బేస్ సినిమా అని ఇందులో హీరోయిన్ పాత్రకి ప్రాధాన్యత ఏమీ ఉండదని అంటున్నారు.ఏది ఏమైనా శృతిహాసన్ “వకీల్ సాబ్” సినిమాలో ఫుల్ లెంగ్త్ హీరోయిన్ పాత్ర చేయటం లేదని వేసిన డైలాగులు పవన్ అభిమానులను ప్రస్తుతం ఖంగారు పెడుతున్నాయి.
.