ఇటీవలే బాలకృష్ణ అఖండ సినిమాతో అఖండమైన విజయం అందుకున్నారు.చాలా రోజుల తర్వాత వచ్చిన విజయంతో బాలయ్య తో పాటు ఆయన అభిమానులు కూడా సంతోషంగా ఉన్నారు.
బోయపాటి, బాలయ్య కాంబో మరొకసారి సూపర్ హిట్ అని వీరు నిరూపించారు.ఈ సినిమా తర్వాత బాలయ్య మరొక సినిమాను స్టార్ట్ చేసాడు.
యాక్షన్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య తన తర్వాత సినిమా చేయబోతున్నాడు.
వీరిద్దరి కాంబోలో మాస్ ట్రీట్ రూపొందుతున్న విషయం తెలిసిందే.
పక్కా మాస్ అండ్ కమర్షియల్ చిత్రంగా వీరిద్దరి కాంబోలో #NBK107 సినిమా రూపొందుతుంది.ఈ సినిమాలో బాలకృష్ణ కు జోడీగా శృతి హాసన్ కథానాయికగా నటిస్తుంది.
ఈ రోజు శృతి హాసన్ పుట్టిన రోజు సందర్భంగా చిత్ర యూనిట్ ఈమెకు విషెష్ చెబుతూ ప్రత్యేక పోస్టర్ విడుదల చేసింది.
ఈ పోస్టర్ ను రిలీజ్ చేస్తూ శృతి హాసన్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.అలాగే డైరెక్టర్ గోపీచంద్ మలినేని కూడా శృతికి పుట్టిన రోజు విషెష్ తెలిపాడు.ఇక వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రలో నటించ నుంది.
శాండల్ వుడ్ స్టార్ దునియా విజయ్ ఈ సినిమాలో విలన్ గా చేస్తున్నారు.తన మొదటి టాలీవుడ్ సినిమాతోనే ఒక శక్తివంతం అయినా ప్రతినాయకుడిగా కనిపించ బోతున్నారు.
ఈ సినిమాకు ‘జై బాలయ్య’ అనే టైటిల్ ను అనుకుంటున్నారని టాక్ వినిపిస్తుంది.మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.ఇక థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే స్టార్ట్ కాబోతుంది.యదార్ధ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఎక్కువ భాగం షూటింగ్ అమెరికాలోనే జరగనుందని తెలుస్తుంది.