సినిమా ఇండస్ట్రీ లోకి స్టార్ హీరో కూతురుగా అడుగుపెట్టి తనదైన శైలిలో దూసుకుపోతూ మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్లలో శృతిహాసన్ ఒకరు.తాను ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన మొదటి సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయినప్పటికీ ఆ తర్వాత పలు సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.
ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి వరుస సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా శృతి హాసన్ నిత్యం ప్రేమ వ్యవహారంతో కూడా సోషల్ మీడియాలో నిలుస్తుంటారు.ఈమె తన బాయ్ ఫ్రెండ్ శంతను హజారికా కలిసి దిగిన రొమాంటిక్ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు.
ప్రస్తుతం ముంబైలో తన ప్రియుడితో కలిసి ఉంటున్న శృతిహాసన్ వీలు దొరికినప్పుడల్లా బయటకు వెళుతూ తెగ ఎంజాయ్ చేస్తుంటారు.ఈ క్రమంలోనే గత నెలలో వీరిద్దరూ కలసి ఒక సూపర్ మార్కెట్ లో చేసిన రచ్చ అంతా ఇంతా కాదు.
సూపర్ మార్కెట్ కు ప్రియుడితో కలిసి వెళ్లిన శృతిహాసన్ అందరి ముందు తన బాయ్ ఫ్రెండ్ తో రొమాన్స్ చేయడం, అతనికి ముద్దుల ఇవ్వడంతో మార్కెట్లో ఉన్నటువంటి కస్టమర్లు ఒక్కసారిగా షాక్ అయ్యారు.ఈ క్రమంలోనే ఈ షాపింగ్ కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు రొమాన్స్ కు మరొక ప్లేసు దొరకలేదా.సూపర్ మార్కెట్ లోనే ఏంటి ఈ రచ్చ అంటూ నెటిజన్లు వీరిపై దారుణంగా కామెంట్లు చేస్తున్నారు.ఇకపోతే ప్రస్తుతం శృతి హాసన్ సలార్ సినిమాలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే ఈ సినిమా షూటింగ్ కోసం ఈమె తరచూ హైదరాబాద్, ముంబై వెళ్తూనే ఉంటారు.
ఈ క్రమంలోనే సలార్ సెట్ లో శృతి హాసన్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో కలిసి చేసిన రచ్చ మనకు తెలిసిందే.ఈ ఏడాది రవితేజ నటించిన క్రాక్ సినిమాతో ఫాంలోకి వచ్చిన శృతి హాసన్ ప్రస్తుతం వరుస సినిమా అవకాశాలను దక్కించుకుని ఎంతో బిజీగా గడుపుతున్నారు.