టాలీవుడ్ సినీ నటి, గ్లామర్ బ్యూటీ శృతిహాసన్.ప్రస్తుతం వరుస సినిమాలతో బాగా బిజీగా ఉంది.
స్టార్ హీరోల సరసన నటించి స్టార్ డమ్ ను అందుకుంది శృతిహాసన్.ఇక ఏ విషయమైనా ముక్కుసూటి తో మాట్లాడుతుంది ఈ బ్యూటీ.
ఈ మధ్య తన బాయ్ ఫ్రెండ్ తో ఉంటూ బాగా రచ్చ చేస్తుంది.పైగా ఏదో ఒక వార్తతో హాట్ టాపిక్ గా మారుతుంది.
ఇదిలా ఉంటే తాజాగా ప్రభాస్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ పై షాకింగ్ కామెంట్స్ చేసింది.
టాలీవుడ్ పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలలో ఓ రేంజ్ లో దూసుకుపోతున్నాడు.
అంతే కాకుండా బాలీవుడ్ స్థాయిని మించి సక్సెస్ లను అందుకుంటున్నాడు.ఇక ఆయన నటన విషయం పక్కన పెడితే.వ్యక్తిగత విషయంలో ఎప్పుడు పై స్థానంలో ఉంటాడు.కానీ అలా ఫీల్ అవ్వడు ప్రభాస్.
మేకప్ మ్యాన్ నుండి ప్రతి ఒక్కరితో ఫ్రెండ్లీగా ఉంటాడు.ఇక కే జి ఎఫ్ ఫేమ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గురించి అందరికీ తెలిసిందే.
తన దర్శకత్వంతో మంచి విజయాన్ని అందుకుంటున్న ప్రశాంత్ నీల్ ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాలలో దర్శకత్వం వహిస్తున్నాడు.
ఇక ప్రభాస్ తో కూడా ప్రశాంత్ నీల్ ‘సలార్‘ సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే.ఇక ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుంది.లాక్ డౌన్ ఎత్తివేయడంతో ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ బిజీ లో ఉంది.
దీంతో శృతిహాసన్, ప్రభాస్ ల మధ్య గోదావరిఖనిలో కొన్ని సన్నివేశాలను చేయిస్తున్నాడు ప్రశాంత్ నీల్.
ఈ నేపథ్యంలో శృతిహాసన్ ప్రభాస్, ప్రశాంత్ నీల్ గురించి మాట్లాడుతూ.డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ సినిమా కోసం బాగా కష్టపడుతున్నాడని తెలిపింది.సన్నివేశాలను బాగా కమ్యూనికేట్ చేస్తాడని, తనకు కావాల్సిన అవుట్ పుట్ కోసం పరితపిస్తాడని తెలిపింది.
ఇక ప్రభాస్ చాలా సింపుల్ గా ఉంటాడని.అందరితో ప్రేమగా మాట్లాడుతాడని పైగా సెట్ లో ప్రభాస్ ఉంటే బాగా సందడిగా ఉంటుందని తెలిపింది.