అజ్ఞాతవాసి సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకొని పవన్ కళ్యాణ్ చేస్తున్న సినిమా వకీల్ సాబ్.పింక్ సినిమాకి రీమేక్ గా దిల్ రాజు బ్యానర్ లో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.
ఇప్పటికే ఈ సినిమా మెజారిటీ షూటింగ్ కంప్లీట్ అయిపొయింది.ఇక సినిమాలో 20 శాతం మాత్రమే పెండింగ్ లో ఉంది.
నెల రోజుల పాటు ఉండే ఈ చివరి షెడ్యూల్ కోసం ఇప్పటికే అన్నపూర్ణ స్టూడియోలో సెట్ వేస్తున్నారు.ఇదిలా ఉంటే ఈ సినిమాలో హీరోయిన్ గా శృతి హసన్ ని ఫైనల్ చేసారని టాక్ వినిపిస్తుంది.
అయితే ఈ అమ్మడు మాత్రం ఎలాంటి నిర్ణయం చెప్పకుండా నిర్మాతని హోల్డ్ లో పెట్టిందని చెప్పుకుంటున్నారు.
పవన్ కళ్యాణ్ ఆగస్టు నుంచి షూటింగ్ లో పాల్గొంటానని చెప్పడంతో నివేదా థామస్, అంజలి, అనన్య నాగళ్ళ, ప్రకాష్ రాజ్, సీనియర్ వంటి ముఖ్య తారాగణంతో కోర్ట్ సన్నివేశాలను చిత్రీకరించేందుకు దిల్ రాజు, దర్శకుడు సిద్దమవుతున్నారు.
ఈ షెడ్యూల్ లోనే హీరోయిన్ గా నటిస్తున్న శృతిహాసన్ ని జాయిన్ చేయాలని తన మీద కొన్ని కీలక సన్నివేశాలని చిత్రీకరించాలని దిల్ రాజు సంప్రదించారని సమాచారం.అయితే ఇప్పుడు ఈ సినిమాలో నటించేందుకు శృతి హసన్ భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తుందన్న వార్తలు రావడంతో శృతిహాసన్ స్పందించింది.
రెమ్యూనరేషన్ పరంగా తను ఎలాంటి డిమాండ్స్ పెట్టలేదని సన్నిహిత వర్గాల దగ్గర చర్చించినట్టు సమాచారం.వకీల్ సాబ్ సినిమా విషయంలో తనపై వస్తున్న రూమర్స్ అన్నింటికీ త్వరలో ఫుల్ స్టాప్ పెట్టబోతున్నట్లు సన్నిహితులు చెబుతున్నారు.