నందమూరి నటసింహం బాలకృష్ణతో అఖండ తర్వాత గోపీచంద్ మలినేని సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు.ఈ సినిమాకి నిర్మాతలు కూడా ఇప్పటికే ఫిక్స్ అయిపోయారు.
భారీ బడ్జెట్ తో యాక్షన్ బ్యాక్ డ్రాప్ లోనే బాలకృష్ణ కోసం గోపీచంద్ మలినేని కథ సిద్ధం చేసినట్లు తెలుస్తుంది.ఇక రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ బేస్ చేసుకొని ఈ సినిమా కథని కూడా అదిరిపోయే మాస్ ఎలిమెంట్స్ తో గోపీచంద్ రెడీ చేసి ఇప్పటికే బాలయ్యకి కూడా నేరేట్ చేసాడని టాక్ వినిపిస్తుంది.
ఇక ఇందులో బాలకృష్ణని పోలీస్ ఆఫీసర్ గా రిప్రజెంట్ చేసే అవకాశం ఉందనే బోగట్టా.ఇదిలా ఉంటే ఇప్పటికే ఈ సినిమాకి సంబందించిన ప్రీప్రొడక్షన్ వర్క్ ని దర్శకుడు గోపీచంద్ స్టార్ట్ చేశాడు.
క్రాక్స్ సినిమాని రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కించి హిట్ కొట్టడంతో ఈ సారి కూడా అలాంటి కథాంశాన్నే బాలయ్యకి కోసం గోపీచంద్ నమ్ముకున్నాడు.
ఇదిలా ఉంటే ఈ సినిమాలో తన లక్కీ హీరోయిన్ అయిన శృతి హసన్ ని హీరోయిన్ గా రిపీట్ చేయాలని గోపీచంద్ భావిస్తున్నట్లు తెలుస్తుంది.
స్టార్ హీరోయిన్ గా ఉన్న శృతి హసన్ ప్రస్తుతం యంగ్ హీరోలతోనే ఎక్కువగా నటిస్తుంది.ఇప్పటి వరకు సీనియర్ హీరోలతో జత కట్టలేదు.అయితే గోపీచంద్ మాత్రం శృతి హసన్ ని తీసుకుంటే హిట్ వస్తుందనే నమ్మకంతో ఉన్నాడు.దాంతో ఎలా అయిన బాలయ్య కోసం ఆమెని దించాలని భావిస్తున్నాడు.
అయితే బాలయ్యతో ఒక్క నయనతార తప్ప స్టార్ హీరోయిన్స్ ఎవరూ ఈ మధ్యకాలంలో నటించలేదు.మరి శృతి హసన్ ని ఒప్పించి బాలయ్యకి జోడీగా నటించేలా చేస్తే మాత్రం అది సినిమాకి మరింత ప్లస్ అయ్యే అవకాశం ఉందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది.
ఆమె కాకుంటే లక్ష్మీ రాయ్ ని గోపీచంద్ ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.