డిజిటల్ ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ తమ పరిధిని విస్తృతం చేసుకొని మరింత ఎక్కువ మంది డిజిటల్ ఆడియన్స్ ని పెంచుకోవడానికి వీలైనంత ఎక్కువగా ఖర్చు పెడుతుంది.కరోనాకి ముందువరకు డిజిటల్ ఛానల్స్ గురించి ఎవరూ పెద్దగా పట్టించుకునే వారు కాదు.
కాని ఈ రెండేళ్ళలో ఊహించని స్థాయిలో డిజిటల్ వ్యూవర్ షిప్ ఒటీటీ ఛానల్స్ కి పెరిగింది.థియేటర్స్ ఓపెన్ కాకపోవడం, అలాగే ఓపెన్ అయినా కూడా ఫ్యామిలీతో కలిసి సినిమాలు చేయడానికి థియేటర్స్ కి వెళ్ళాలనే కాన్సెప్ట్ కి చాలా మంది శుభం కార్డు వేసేశారు.
హ్యాపీగా ఇంట్లో ఉంటూ టీవీలో ఒటీటీలో కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు చూసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు.దీంతో చిన్న సినిమాల నిర్మాతలలో చాలా మంది థియేటర్స్ లో సినిమా రిలీజ్ లకి భయపడి ఒటీటీకి మొగ్గు చూపిస్తున్నారు.
ఇక ఛానల్స్ ఆధిపత్యం కారణంగా వారికి గిట్టుబాటుగానే సినిమాకి పెట్టిన పెట్టుబడితో పాటు లాభం కూడా వస్తూ ఉండటంతో ఒటీటీ రిలీజ్ కి ఒకే చెప్పేస్తున్నారు.మరో వైపు ఒటీటీ ఛానల్స్ కూడా భారీగా పెట్టుబడి పెట్టి సినిమాలు, వెబ్ సిరీస్ లని స్టార్ క్యాస్టింగ్ తో తెరకెక్కించడానికి రెడీ అవుతున్నాయి.
ఈ నేపధ్యంలో నెట్ ఫ్లిక్స్ ఓ క్రేజీ ప్రాజెక్ట్ ని ప్లాన్ చేసింది.టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి, శృతి హాసన్ కాంబినేషన్ లో ఓ వెబ్ సిరీస్ ని ప్లాన్ చేస్తుంది.
వీళ్ళిద్దరికి అన్ని బాషలలో మార్కెట్ ఉండటంతో పాటు నెట్ ఫ్లిక్స్ వారిని ఫైనల్ చేసుకున్నట్లు తెలుస్తుంది.భారీ బడ్జెట్ తో థ్రిల్లర్ జోనర్ లోనే ఈ వెబ్ సిరీస్ ని తెరకెక్కించబోతున్నట్లు టాక్ వినిపిస్తుంది.