నితిన్ హీరోగా రూపొందబోతున్న ‘అంధాదున్’ రీమేక్ లో కీలక పాత్రకు గాను శ్రియ శరన్ ను సంప్రదించారనే వార్తలు వచ్చాయి.అయితే సినిమాకు ఆమె నో చెప్పింది.
హిందీలో టబు ఆ పాత్రను పోషించి విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది.నయన్ కూడా ఆ పాత్రను చేసేందుకు ఆసక్తి చూపించింది.
కాని పారితోషికం కుదరక పోవడం వల్ల ఆమె నటించలేదు.అలాంటి మంచి పాత్రను శ్రియ ఎందుకు కాదనుకుంది అంటూ అంతా రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు.
ఈ సమయంలో ఆసక్తికర చర్చ జరుగుతోంది.
అంధాదున్ రీమేక్ కు శ్రియ నో చెప్పడానికి కారణం ఆమె తల్లి కాబోతుండటమే అంటున్నారు.
ప్రస్తుతం విదేశాల్లో ఉన్న శ్రియ గర్బవతి అని బేబీకి జన్మనిచ్చిన తర్వాతే ఇండియాలో ఆమె అడుగు పెడుతుందని అంటున్నారు.అందుకే ఆమె కోసం ప్రయత్నించినా కూడా ఎవరికి ఆమె ఓకే చెప్పడం లేదు.
బేబీకి జన్మనిచ్చిన తర్వాత మళ్లీ సినిమాల్లో నటించేందుకు ఆమె ఆసక్తిగా ఉన్నట్లుగా తెలుస్తోంది.
టాలీవుడ్ లో సుదీర్ఘ కాలం స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగిన ఈ అమ్మడు రష్యాకు చెందిన ఆండ్రీ కోస్చీవ్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెల్సిందే.ప్రస్తుతం వీరిద్దరు వైవాహిక జీవితాన్ని సంతోషంగా సాగిస్తున్నారు. రష్యాలో వీరు ఉన్నట్లుగా తెలుస్తోంది.
తల్లి కాబోతున్న విషయాన్ని శ్రియ ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించలేదు.కనుక ఈ వార్త నిజమేనా కాదా అనే విషయం ఆమె నోరు తెరిస్తే కాని క్లారిటీ రాదు.