2001వ సంవత్సరంలో ఇష్టం సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టిన ముద్దుగుమ్మ శ్రియా సరన్.అప్పటినుంచి ఇప్పటివరకు తన వన్నె తరగని అందంతో ప్రేక్షకుల హృదయాలను ఈ అమ్మడు కొల్లగొడుతోంది.
అయితే గతంలో ఈ అమ్మడు రహస్యంగా పెళ్లి చేసుకోవడంతో శ్రీ అభిమానులు బాగానే హర్ట్ అయ్యారు.అంతేగాక తన పెళ్లి గురించి రహస్యంగా ఉంచిన శ్రీయ తన భర్త గురించి కూడా ఎటువంటి వివరాలు బయట ప్రపంచానికి తెలియనివ్వ లేదు.
అయితే తన పెళ్ళై రెండేళ్లు కావస్తుండగా తాజాగా శ్రియ తన పెళ్లికి బంధం గురించి స్పందించింది.గతేడాది మార్చిలో రష్యా దేశానికి చెందిన టెన్నిస్ క్రీడాకారుడు ఆండ్రీ కోషీవ్ ను తాను పెళ్లి చేసుకున్నానని అయితే ఈ వివాహానికి తక్కువ మంది మాత్రమే హాజరయ్యారని అన్నారు.
అలాగే తన పెళ్లి విషయంలో దాచడానికి ఏమీ లేదని తన వ్యక్తిగత జీవితాన్ని ప్రైవేట్ గా ఉంచుకోవడం కోసమే తన పెళ్లి విషయాన్ని బయటకు తెలియని ఇవ్వడం లేదని చెబుతోంది ఈ అమ్మడు.తన భర్తకు కూడా ఇలా ఉండటమే ఇష్టమని ఇందుకుగాను అతడు ఎంతో సహకారం అందించాడనిని పేర్కొంది.అలాగే తన ఇష్టాలని ఆండ్రీ ఎంతో గౌరవిస్తాడని అందుకే అతడంటే నాకు చాల ఇష్టమని శ్రియ తెలిపారు.
అయితే ఈ సంవత్సరంలో శ్రియ చివరిసారిగా స్వర్గీయ ఎన్టీ రామారావు బయోపిక్ లో నటించింది.
అయితే ఈ చిత్త్రాలు పెద్దగా ఆడలేదు.దీంతో ప్రస్తుతం శ్రియ చేతిలో పెద్దగా అవకాశాలు లేవు.