సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ శ్రియ పదేళ్ళ పాటు ఇండస్ట్రీని ఏలింది.ఇక ఇప్పుడు సినిమా అవకాశాలు అప్పుడప్పుడు వస్తున్నాయి.
ఇక గత ఏడాది చాలా కాలంగా ప్రేమిస్తున్న తన ప్రేమికుడు రష్యాకి చెందిన బిజినెస్ మ్యాన్ ఆండ్రీ కొసఛీవ్ వివాహం చేసుకుంది.ఆండ్రూతో కలిసి అప్పుడప్పుడు సోషల్ మీడియాలో సందడి చేస్తున్న ఈ భామ ప్రస్తుతం ఏవో ఒకటి అర సినిమాలలో నటిస్తుంది.
ఇక పెళ్లి తర్వాత భర్తతో కలిసి స్పెయిన్ లో బార్సిలోనా సిటీలో సెటిల్ అయిపొయింది.అక్కడ తను కూడా భర్తతో పాటు బిజినెస్ లోకి దిగి రెండు రెస్టారెంట్లు ఏర్పాటు చేసింది.
కొద్ది కాలం వరకు ఈ రెండు రెస్టారెంట్లుకి ఫుల్ డిమాండ్ ఉంది.
అయితే కరోనా ప్రభావం ఇప్పుడు ఈ అమ్మడు బిజినెస్ మీద పడింది.
కరోనా భయంతో రెస్టారెంట్లుకి వెళ్లేందుకు కూడా జనం ఆసక్తి చూపించడం లేదు.ఇంటి ఫుడ్ కి పరిమితం అయిపోయారు.
ఉన్నదాంతో కంప్రమైజ్ అవుతున్నారు తప్ప హోటల్స్ కి వెళ్లి తినాలి అనే ఆలోచన కూడా మారిపోయారు.ఈ కారణంగా ఇప్పుడు శ్రియ నడుపుతున్న రెండు రెస్టారెంట్లు ఖాళీగా అయిపోయాయి.
కరోనా ఎఫెక్ట్ తో రెస్టారెంట్లుకు వచ్చే వారే లేకుండా పోయారంట.దీంతో రెస్టారెంట్లో ఈగలు తోలుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని ఈ భామ ఫీల్ అవుతుందని తెలుస్తుంది.
మొత్తానికి ఇష్టపడి పెట్టుకున్న వ్యాపారంపై ఇలా కరోనా ప్రభావం పడితే ఎంత కష్టంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ప్రస్తుతం ఇలాంటి పరిస్థితిలోనే శ్రియ కూడా ఉంది.