టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ని సొంతం చేసుకున్న నటి శ్రియ శరన్.కెరియర్ ఆరంభంలోనే వెంకటేష్, బాలకృష్ణ, చిరంజీవి, నాగార్జున లాంటి స్టార్స్ తో జతకట్టిన ఈ ముద్దుగుమ్మ ఎప్పుడూ వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా ప్రతి ఏడాది సినిమాలు చేస్తూ వచ్చింది.
సౌత్ ఇండియన్ భాషలతో పాటు హిందీలో కూడా శ్రియ శరన్ హీరోయిన్ గా తన మార్క్ ఐడెంటిటీ చూపించింది.ప్రస్తుతం తెలుగులో గమనం అనే పాన్ ఇండియా సినిమాలో నటిస్తుంది.
ఈ సినిమాలో ఆమె మూగ, చెవుడు ఉన్న ఒక బిడ్డతల్లిగా నటిస్తుంది.శ్రియ కెరియర్ ఆరంభంలో ఎక్కువగా గ్లామర్ పాత్రలకే పరిమితం అయినా తరువాత తనని తాను మార్చుకుంటూ మంచి మంచి పాత్రలలో నటించింది.
మనం సినిమాలో ఆమె చేసిన డాక్టర్ పాత్ర చూస్తే శ్రియ పెర్ఫార్మెన్స్ ఏంటో తెలుస్తుంది.
ఇదిలా ఉంటే హీరోయిన్ గా ఏకంగా 20 ఏళ్ల కెరియర్ ని శ్రియ పూర్తి చేసుకుంది.పెళ్లి చేసుకొని ఫారిన్ లో సెటిల్ అయినా కూడా సినిమాల కోసం ఈ అమ్మడు ఇండియా వచ్చి వెళ్తుంది.ప్రస్తుతం శ్రియ రెండు తమిళ సినిమాలు చేస్తుంది.
అలాగే తెలుగులో గమనం సినిమా కంప్లీట్ చేసింది.మరో వైపు హిందీ వెబ్ సిరీస్ లో నటిస్తుంది.
డిజిటల్ ఫ్లాట్ ఫామ్ లోకి అడుగుపెట్టి అక్కడ కూడా తన ముద్ర వేసుకోవాలని శ్రియ ప్రయత్నం చేస్తుంది.ఇప్పటికి ఏ మాత్రం వన్నె తగ్గని అందంతో ఉన్న శ్రియ నటిగా మాత్రం తన ప్రయాణం కొంత మార్చుకుంది.
రెగ్యులర్ పాత్రలు కాకుండా ప్రాధాన్యత ఉన్న రోల్స్ ఎంపిక చేసుకుంటుంది.అలాగే కంటెంట్ బేస్ కథలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది.
క్యారెక్టర్ నచ్చితే కొత్త హీరోలతో చేయడానికి కూడా తనకి ఎలాంటి అభ్యంతరం లేదని ఈ సీనియర్ స్టార్ హీరోయిన్ ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చింది.