ఇటీవల సోషల్ మీడియాలో ఏదో ఒక ఛాలెంజ్తో జనాలు బిజీగా ఉంటున్నారు.అప్పట్లో ఐస్ బకెట్ ఛాలెంజ్ నుండి మొదలుకొని ఇటీవల హ్యాండ్ వాష్ ఛాలెంజ్ వరకు అన్నింటినీ ట్రెండింగ్లో పెట్టారు జనాలు.
అయితే ఈ ఛాలెంజ్లను కేవలం సామాన్యులకే కాకుండా సెలబ్రిటీలు సైతం స్వీకరించి ఆచరించారు.
అయితే తాజాగా అందాల భామ శ్రియా సరన్ ఓ సరికొత్త ఛాలెంజ్ను విసిరింది.
శ్రియా తన భర్త ఆండ్రీ కొశ్చీవ్ గిన్నెలు తోముతున్న వీడియోను తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావంతో దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలులో ఉన్న సంగతి తెలిసిందే.
దీంతో ఈ సమయంలో సెలబ్రిటీలు వారి భార్యలకు తోడుగా ఉండి ఇలా వంటింటి పనుల్లో సహాయం చేయాల్సిందిగా శ్రియా కోరింది.ఇలా తన భర్తలా పలువురు సెలబ్రిటీలు కూడా అంట్లు తోమాలంటూ శ్రియా ఛాలెంజ్ విసిరింది.
శ్రియా ఈ ఛాలెంజ్ను విసిరిన వారిలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, తమిళ హీరో ఆర్య ఉన్నారు.దీంతో బన్నీ కూడా ఈ ఛాలెంజ్ను ఒప్పుకుంటాడా అని మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా చూస్తున్నారు.
ఇక సినిమాల పరంగా శ్రియా ప్రస్తుతం నందమూరి బాలయ్య నటిస్తున్న తాజా చిత్రంలో హీరోయిన్గా నటించనుంది.