టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి, నందమూరి నటసింహం బాలయ్య బాబు, విక్టరీ వెంకటేష్, ఇంకా నాగార్జున జూనియర్ ఎన్టీఆర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాస్ మహారాజ్ రవితేజ ఇలా దాదాపుగా అందరి స్టార్ హీరోల సరసన నటించి తెలుగు ప్రేక్షకులను ఎంతగానో మెప్పించిన ముంబై బ్యూటీ శ్రియ శరణ్ గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే పెళ్లయిన తర్వాత కొంతమేర సినిమాల పరంగా తగ్గించినట్లు తెలుస్తోంది.
అంతేగాక ప్రస్తుతం శ్రియ శరన్ తన భర్తతో కలిసి ఇ రష్యా దేశంలో నివాసం ఉన్నట్లు సమాచారం.
అయితే తాజాగా నటి శ్రియ శరణ్ కి సంబంధించినటువంటి ఓ ఫోటో సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ అవుతోంది.
అయితే ఇంతకీ విషయం ఏంటంటే ఇటీవలే బాలీవుడ్ లో లూప్ లపేట, రాగిణి ఎంఎంఎస్, లూటర్ తదితర చిత్రాలను నిర్మించిన టువంటి ప్రముఖ సినీ నిర్మాత తనూజ్ గార్గ్ తన అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా అప్పట్లో శ్రియ తో కలిసి తీసుకున్నటువంటి ఓ ఫోటోని తన స్టోరీ ద్వారా షేర్ చేశాడు.అంతటితో ఆగకుండా అప్పట్లో ఒక రాత్రి సమయంలో తాగిన మైకంలో హీరోయిన్ శ్రియ శరణ్ తో తీసుకున్న ఫోటో అంటూ క్యాప్షన్ కూడా పెట్టాడు.
దీంతో కొంత మంది నెటిజన్లు వెంటనే ఈ ఫోటోని స్క్రీన్ షాట్ తీసుకొని సోషల్ మీడియా మాధ్యమాలలో ట్రెండింగ్ చేస్తున్నారు.మరికొంత మంది నెటిజన్లు మాత్రం ప్రస్తుతం శ్రియ శరణ్ కి పెళ్లి అయిపోయిందని కాబట్టి ఇలాంటి ఫోటోలను సోషల్ మీడియా మాధ్యమాలలో షేర్ చేయడం వల్ల ఆమె కాపురంలో కలహాలు వస్తాయని అంటున్నారు.
ఇంకొందరు ఓ ప్రముఖ నిర్మాత ఆయ్యుండి పెళ్లి అయిన మహిళ గురించి ఇలాంటి పోస్టులు షేర్ చేయడం సరి కాదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం శ్రియ శరణ్ తెలుగులో ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్నటువంటి చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.
అలాగే తమిళ భాషలో కూడా మరో మూడు చిత్రాలలో ఉన్నటువంటి పాత్రలో నటిస్తోంది.