సెప్టెంబర్ 19 నుంచి మొదలు కానున్న ఐపీఎల్ 2020 సీజన్ లో ఎవరికి వారు తాము ఈసారి ఐపీఎల్ టైటిల్ ను సాధిస్తామని ప్రతి జట్టు భావిస్తుంది.అయితే పూర్తిగా యువకులతో నిండి ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ మంచి ఫామ్ లో ఉన్నట్టు గా కనబడుతుంది.
గత సంవత్సరం కూడా ఐపీఎల్ సీజన్ లో అంచనాలకు మించి రాణించారు ఢిల్లీ క్యాపిటల్స్ ప్లే ఆఫ్ రౌండ్స్ కు అర్హత కూడా సాధించింది.అయితే ఈ సారి మాత్రం చరిత్రను తిరగరాస్తామని, ఐపీఎల్ టైటిల్ గెలుస్తామని కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ తెలిపారు.
తమ టీంకు తోడుగా రికీ పాంటింగ్, సౌరబ్ గంగూలీ ఉన్నారని తెలియజేశారు.వారిద్దరి కారణంగా తన పై ఎటువంటి ఒత్తిడి లేదని తెలియజేస్తున్నారు.గత సంవత్సర కాలం నుండి టీమిండియాకు ఆడుతున్నానని, అదే ఆత్మ విశ్వాసంతో ఈసారి ఐపీఎల్ టైటిల్ గెలవడానికి తాము బరిలోకి దిగుతున్నట్టు తెలియజేశాడు.
ఇక ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో రిషబ్ పంత్, పృద్వి షా లాంటి యువ ఆటగాళ్లతో పాటు శిఖర్ ధావన్, అశ్విన్, ఇషాంత్ శర్మ, అమిత్ మిశ్రా లాంటి స్టార్ ఆటగాళ్లు ఉండడంతో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు సమతూకంతో ఉందని శ్రేయాస్ అయ్యర్ తెలియజేశారు.
ఈసారి ఢిల్లీ క్యాపిటల్స్ అభిమానులని అస్సలు నిరాశపరచమని ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ గట్టిగా చెబుతున్నారు.టీమిండియా ఆటగాళ్లతో పాటు కీమో పాల్, హెట్ మైర్, స్టయిన్డ్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు మరింత బలం చేకూర్చేలా ఉన్నారు.