ఈ మధ్యకాలంలో తెలుగమ్మాయిలు పరాయి బాషలో సక్సెస్ అయ్యి చాలా ఆలస్యంగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు.ఈ తెలుగమ్మాయి అయిన ఐశ్వర్య రాజేష్ ఇప్పటికే కోలీవుడ్ లో సత్తా చాటుతుంది.
అలాగే శోభిత దూళిపాళ్ళ ఇప్పటికే బాలీవుడ్ సత్తా చాటుతుంది.గూఢచారి సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది.
అలాగే హైదరాబాద్ బ్యూటీ అమ్రిన్ ఖురేషి బాలీవుడ్ లో అడుగుపెట్టి ఆరంభంలోనే రెండు సినిమాలు చేస్తుంది.ఇక మరో తెలుగమ్మాయి శ్రేయా ధన్వంతరి బాలీవుడ్ లో జోష్ సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది.
ది ఫ్యామిలీ మ్యాన్, స్కామ్ 1992 వెబ్ సిరీస్లతో బాగా గుర్తింపు తెచ్చుకుంది.అయితే ఈ అమ్మడు చాలా రోజులుగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతుంది.
అయితే సరైన సినిమా కోసం వేచి చూస్తుంది.
ఇదిలా ఉంటే తాజాగా ఈ అమ్మడు సోషల్ మీడియా ద్వారా ఆసక్తికర విషయాలు పంచుకుంది.
తెలుగు సినిమాలు ఎక్కువగా చూస్తానని ఈ అమ్మడు చెప్పుకొచ్చింది.అలాగే తన ఫేవరేట్ మూవీ ఆర్జీవీ దర్శకత్వంలో వచ్చిన క్షణంక్షణం అని చెప్పుకొచ్చింది.
ఈ చిత్రాన్ని ఏకంగా 267 సార్లు చూశానని చెప్పింది.ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియాలో రాసుకొచ్చింది.
ఇందులో హీరో దగ్గుబాటి వెంకటేష్, పరేశ్ రావల్, శ్రీదేవి అద్భుతంగా నటించారు అని చెప్పుకొచ్చింది.వారి పెర్ఫార్మెన్స్ అద్బుతంగా ఉంటుందని ప్రశంసించింది.
ఇక తెలుగులో ఎంట్రీ కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని శ్రేయా చెప్పుకొచ్చింది.మరి ఈ భామ టాలీవుడ్ ఎంట్రీ కోసం ఎవరు అవకాశం ఇస్తారనేది ఇప్పుడు వేచి చూడాలి.