రామ్ గోపాల్ వర్మ ఈ మధ్య కాలంలో కేవలం సినిమాని క్వాలిటీ కోసం కాకుండా కేవలం జనాల ఇంటెన్సన్ కి క్యాష్ చేసుకోవడానికి మాత్రమే ఉపయోగించుకుంటున్నాడు.ఈ నేపధ్యంలో చాలా తక్కువ బడ్జెట్ తో కేవలం డిజిటల్ ప్రేక్షకుల కోసం సినిమాలు తీసి వదులుతున్నాడు.
సినిమా పోస్టర్స్ ద్వారా యూత్ కి గాళం వేస్తూ బాగానే డబ్బులు లాగేస్తున్నారు.ఈ నేపధ్యంలో తాజాగా నగ్నం అనే షార్ట్ ఫిల్మ్ ని తన ఆర్జీవీ థియేటర్ ద్వారా ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చాడు.
ఈ సినిమాలో విషయం లేకపోయినా పోస్టర్స్ తో రెచ్చగొట్టి డబ్బులు బాగా కూడబెట్టుకున్నారు.ఈ సినిమాలో హీరోయిన్ గా తెలుగమ్మాయి గోదావరి పిల్ల శ్రీ నటించింది.
ఇందులో స్వీటీ స్క్రీన్ నేమ్ తో ఆమె పరిచయం అయ్యింది.
ఇప్పుడు సినిమాకు సంబంధించి స్వీటీ ఆసక్తికర వ్యాఖ్యలు మీడియాతో పంచుకుంది.
రామ్ గోపాల్ వర్మ హీరోయిన్ కోసం వెదుకుతున్నట్లుగా తెలిసింది.అప్పటికే ఆయన ఎనిమిది మందిని చూశాడట.
వారు ఎవరు నచ్చలేదు.నన్ను ఎలా ఉంటావో అలాగే రామన్నారు.
ట్రెడిషనల్ గా వెళ్తే రామ్ గారికి నచ్చదేమో అనుకున్నాను.కానీ ఎలా ఉంటే అలాగే రమ్మన్నారు.
అందుకే ట్రెడిషనల్ గా వెళ్ళాను.నన్ను చూసిన తర్వాత ఆయన ఎత్తు అడిగారు.
నాకు కథను నరేట్ చేశారు.సినిమా షూటింగ్ రేపటి నుండి అన్నారు.
సినిమా నెల రోజులు అన్నారు కానీ రెండు వారల్లోనే పూర్తి అయింది.షూటింగ్ రెండు రోజులు గంట డబ్బింగ్ మిగిలిన రోజులు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్.
ఈ సినిమా లో న్యూడ్ గా నటించాల్సిన అవసరం లేదన్నారు.కాస్త హాట్ గా కనిపించాల్సి వస్తుందని అన్నారు.
రెగ్యులర్ సినిమాలో చూపిన విధంగా కాకుండా మరోలా తీశారు.కానీ అవి మాత్రం ప్రేక్షకులకు నగ్నంగా నటించినట్లుగా అనిపించింది.
సినిమాలో నటించినందుకు నాకు రెండు రోజులకి రెండు లక్షలు ఇచ్చారని ఈ భామ చెప్పింది.