జెర్సీ సినిమాతో టాలీవుడ్ లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన కన్నడ భామ శ్రద్ధా శ్రీనాథ్.ఈ భామ మొదటి సినిమాతోనే నటిగా మంచి మార్కులు కొట్టేసింది.
అయితే ఎంట్రీ సినిమానే ఒక బిడ్డకి తల్లి పాత్రలో ఈ అమ్మడు కనిపించడంతో తెలుగులో అనుకున్న స్థాయిలో ప్రాధాన్యత ఉన్న పాత్రలు రావడం లేదు.తెలుగు సినిమాలలో గ్లామర్ హీరోయిన్స్ ఎక్కువగా రాణిస్తారు.
అయితే ఈ విషయంలో శ్రద్ధా శ్రీనాథ్ కాస్త వెనుకబడి ఉందని చెప్పాలి.థియేటర్స్ ఆర్ట్స్ నుంచి వచ్చిన ఈ అమ్మడు గ్లామర్ కంటే పెర్ఫార్మెన్స్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది.
ఈ నేపధ్యంలో తెలుగులో స్టార్ హీరోల పక్కన ఛాన్స్ అందుకోలేకపోతుంది.జెర్సీ తర్వాత ఆదితో కలిసి ఒక సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చింది.
ఆ సినిమా ఎవరికీ కనెక్ట్ కాలేదు.రీసెంట్ గా కృష్ణ అండ్ హిస్ లీల అనే సినిమాలో సందడి చేసింది.
ఆ సినిమా హిట్ అయినా ఆమెకి వచ్చే గుర్తింపు అయితే ఏమీ లేదు.ప్రస్తుతం నరుడి బ్రతుకు నటన అనే సినిమా మాత్రమే తెలుగులో చేస్తుంది.
అయితే తెలుగు దర్శక, నిర్మాతలు శ్రద్ధా శ్రీనాథ్ కి అనుకున్న స్థాయిలో అవకాహాలు ఇవ్వకపోయినా తమిళ్, కన్నడ, మలయాళీ బాషలలో మాత్రం ఈ భామ వరుస సినిమాలతో దూసుకుపోతుంది.తమిళంలో విశాల్ చక్ర సినిమాలో హీరోయిన్ గా నటించింది.ఈ సినిమా రిలీజ్ కి రెడీ అవుతుంది.అలాగే మలయాళంలో మోహన్ లాల్ తో కలిసి ఒక ఆరాట్టు అనే సినిమాలో నటించింది.ఇది కూడా రిలీజ్ కి రెడీ అవుతుంది.ఇవి కాకుండా మరో ఐదు సినిమాలు శ్రద్ధా సైన్ చేసింది.
ఈ ఏడాదిలోనే అన్ని సెట్స్ పైకి వెళ్లనున్నాయి.ఈ లెక్కన చూసుకుంటే ఈ ఏడాదిలో శ్రద్ధా ఏకంగా ఎనిమిది సినిమాలతో బ్యాక్ టూ బ్యాక్ ప్రేక్షకుల ముందుకి రావడానికి రెడీ అవుతుందని చెప్పాలి.
దీనిని బట్టి తెలుగు దర్శకులు శ్రద్ధాని పక్కన పెట్టినా మిగిలిన మూడు బాషలలో ఆమె హవా కొనసాగిస్తుందని అర్ధమవుతుంది.