బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసు దర్యాప్తులో డ్రగ్స్ కోణం వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే.ఈ కేసు విచారణ చేపట్టిన నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో ఇప్పటికే సుశాంత్ ప్రేయసి రియా చక్రవర్తిని, ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తిని అరెస్ట్ చేశారు.
వారితో పాటు డ్రగ్స్ సప్లయర్స్ గా ఉన్నాయనే ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని కూడా అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.ఇక ఈ విచారణలో బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎవరెవరికి డ్రగ్స్ మాఫియాతో లింకులు ఉన్నాయనే కోణాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.
ఇక ఈ కేసు విచారణలో రియా కూడా పలువురు పేర్లు తెలియజేసిందని టాక్ వినిపిస్తుంది.ముఖ్యంగా సినిమా ప్రముఖుల పేర్లుని ఆమె ఎన్సీబీ అధికారులకి వెల్లడించిందని మీడియాలో వినిపిస్తుంది.
అయితే ఆమె సినీ ప్రముఖుల పేర్లు ఎవరివి కూడా చెప్పలేదని ఎన్సీబీ అధికారులు ఇప్పటికే తేల్చేశారు.
అయితే రియాతో సన్నిహిత సంబంధాలు ఉన్న రకుల్ ప్రీత్ సింగ్, సారా ఆలీఖాన్ పేర్లు ఈ డ్రగ్స్ కేసులో వినిపిస్తున్నాయి.
ఇప్పుడు సుశాంత్ ఫాంహౌజ్ మేనేజర్ ఈ కేసుకి సంబందించి కొన్ని విషయాలు వెల్లడించినట్లు తెలుస్తుంది. సుశాంత్ ఫామ్ హౌస్ లో జరిగే డ్రగ్ పార్టీలకు రియా, సారాలతో పాటు మరికొందరు హాజరయ్యారని, ఈ లిస్టులో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ కూడా ఉన్నట్టు మేనేజర్ చెప్పినట్లు టాక్ వినిపిస్తుంది.
లోనావాలాలోని సుశాంత్ ఫాంహౌజ్ ను సారా అలీఖాన్, రియా చక్రవర్తితోపాటు శ్రద్ధాకపూర్ తరచూ వినియోగించుకునేవారని, రేవ్ పార్టీలకు హాజరయ్యేవారని, గంజాయి, స్మోకింగ్ పేపర్స్, ఖరీదైన వొడ్కా వాడకం వారి పార్టీల్లో సాధారణమని ఫాంహౌజ్ మేనేజర్ రయీస్ వెల్లడించినట్టు మీడియాలో వినిపిస్తుంది.ఈ నేపధ్యంలో ఎన్సీబీ అధికారులు శ్రద్ధా కపూర్ కి కూడా నోటీసులు ఇచ్చి విచారణకి పిలిచే అవకాశం ఉందని చెప్పుకుంటున్నారు.