తమిళ బ్యూటీ అమలాపాల్ నటించిన ‘ఆమె’ చిత్రం ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే.ఈ సినిమాలో అమ్మడు పూర్తి నగ్నంగా నటించడంతో ఈ సినిమా రిలీజ్కు ముందే ఓ రేంజ్లో హైప్ క్రియేట్ చేసింది.
భర్తతో విడాకులు తీసుకున్న తరువాత అమలాపాల్ ఈ రేంజ్లో రెచ్చిపోవడానికి కారణమేమిటా అనే టాక్ అప్పట్లో కోలీవుడ్లో పెద్ద ఎత్తున వినిపించింది.కాగా ఇప్పుడు అమలాపాల్ చేసిన ఆమె చిత్రాన్ని బాలీవుడ్లో రీమేక్ చేసేందుకు ప్రయత్నాలు చకచకా జరుగుతున్నాయి.
ఈ సినిమాను బాలీవుడ్లో స్టార్ బ్యూటీ శ్రద్ధా కపూర్ చేసేందుకు రెడీ అవుతోంది.బోల్డ్ పాత్రలో నటించేందుకు ఆమె ఎలాంటి అభ్యంతరం చెప్పకపోవడంతో బాలీవుడ్తో పాటు సౌత్ ఆడియెన్స్ కూడా అమ్మడి అందాలను వీక్షించేందుకు ఎంతో ఆసక్తిగా ఉన్నారు.
అయితే ఈ సినిమాను బాలీవుడ్లో భారీ బడ్జెట్తో తెరకెక్కించేందుకు ఓ బడా బ్యానర్ ముందుకు వచ్చింది.యశ్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ ఆమె చిత్ర రీమేక్ను చేసేందుకు రెడీగా ఉండటంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోయాయి.
అసలు టాప్ బ్యానర్ కావడంతో, వారు ఏ విషయంలోనూ కాంప్రమైజ్ కారు.మరి శ్రద్ధా కపూర్ను నూలుపోగు లేకుండా చూపించే అంశంపై వారు ఎలాంటి స్టెప్ తీసుకుంటారా అనే అంశం ప్రస్తుతం బి-టౌన్లో ఆసక్తిగా మారింది.
ఇక ఈ సినిమాను తమిళంలో తెరకెక్కించి అదిరిపోయే గుర్తింపును తెచ్చుకున్న దర్శకుడు రత్న కుమార్, హిందీలోనూ స్వయంగా డైరెక్ట్ చేస్తున్నాడు.పూర్తి థ్రిల్లర్ మూవీగా రానున్న ఈ సినిమా శ్రద్ధా కపూర్కు ఎలాంటి ఫేం తీసుకొస్తుందో తెలియాలంటే మాత్రం ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.
సాహో చిత్రంతో సౌత్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపును తెచ్చుకున్న శ్రద్ధా కపూర్, ఇప్పుడు ఏకంగా సౌత్ చిత్రాన్ని బాలీవుడ్లో రీమేక్ చేస్తుండటం విశేషం.