సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య తరువాత బాలీవుడ్ ఇండస్ట్రీలో బంధుప్రీతి గురించి ఎక్కువ చర్చ నడుస్తుంది.నెపొటిజం కారణంగా చాలా మంది టాలెంటెడ్ నటులు అవకాశాలు కల్పోతున్నారు అంటూ పలువురు విమర్శలు చేస్తున్నారు.
తాము కూడా కేవలం బంధుప్రీతి కారణంగానే బాలీవుడ్ లో ఎదగాలేకపోయామని కొంత మంది భామలు చెబుతున్నారు.అగ్ర దర్శకులు కూడా కొత్త టాలెంట్ కంటే బంధుప్రీతికి మొదటి ప్రాధాన్యత ఇస్తారని ఆరోపణలు చేస్తున్నారు.
ఇప్పుడు ఈ ఆరోపణలు, విమర్శలు చేసిన వారి జాబితాలో టాలీవుడ్ హాట్ బ్యూటీ శ్రద్ధా దాస్ కూడా చేరిపోయింది.చాలా మంది బంధు ప్రీతీకి మద్దతుగా సోషల్ మీడియాలో కామెంట్స్ పెట్టడంపై ఆమె తన ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది.
ఇది వరకు బాలీవుడ్ లో నెపోటిజం గురించి విమర్శలు చేసిన శ్రద్ధా మరో మారు సోషల్ మీడియాలో ఆసక్తికర కామెంట్స్ పోస్ట్ చేసింది.
ప్రస్తుతం ఇండస్ట్రీలో ఈ బంధుప్రీతిపై నడుస్తున్న చర్చలు చూసి విసుగొస్తుంది.
పైగా ప్రతీ రంగంలోనూ అలానే ఉంటుందని కొంత మంది నెపోటిజం అసలు తప్పే కాదన్నట్లు మాట్లాడుతున్నారు.తల్లీదండ్రులు వారి వారసత్వాన్ని కొడుకులకు ఇస్తారని చెబుతున్నారు.ఒకవేళ మా పేరెంట్స్ డాక్టర్లు, ఇంజనీర్లు అయితే పరీక్షలు లేకుండా డైరెక్ట్ గా డాక్టర్, ఇంజనీర్ అవ్వగలనా అని ప్రశ్నించింది.ప్రతీ ఒక్కరికీ అవకాశాలు వస్తాయి.
అందులోను బ్యాక్ గ్రౌండ్ ఉన్నవారికి రెడ్ కార్పెట్ పరిచి మరీ ఛాన్స్ ఇస్తారు.అదే కొత్తవారైతే ఎన్నో పాట్లు పడాలని ఈ సందర్భంగా శ్రద్దా గుర్తు చేసింది.
పెద్ద సినిమాలో ఛాన్స్ రావాలంటే పేరున్న డైరెక్టర్లను కలవాలంటే కొత్తవాళ్లకు ఎంతో కష్టం అని, అదే వారసులకి అయితే చాలా సులభంగా కలిసే అవకాశం దొరుకుతుందని ఈ సందర్భంగా శ్రద్ధా పోస్ట్ కామెంట్స్ చేసింది.