న్యూ ఇయర్ వేడుకలలో మందేస్తూ చిందేసేందుకు జనాలు అలవాటు పడిపోయారు.ఇక ఈవెంట్లు నిర్వహించే వారైతే న్యూ ఇయర్ వేడుకలతో ఎంత వీలైతే అంత ఎక్కువ క్యాష్ చేసుకోవాలని చూస్తారు.
దీనికోసం పలువురు సెలెబ్రిటీలను పిలిచి మరీ వారితో న్యూ ఇయర్ వేడుకలు నిర్వహిస్తారు.ఈ వేడుకలకు జనాలు పెద్ద ఎత్తున వస్తారని నిర్వాహకులు ప్లాన్ చేస్తారు.
అయితే ఇలాంటి న్యూ ఇయర్ వేడుకకు వెళ్లిన ఓ హీరోయిన్ను అక్కడి జనం నలిపేశారు.
ఖమ్మంలో న్యూ ఇయర్ వేడుకల్లో హాజరయ్యేందుకు వెళ్లిన హీరోయిన్ శ్రద్ధా దాస్ను నిర్వాహకులు తీసుకెళ్లారు.
అయితే వారు ఊహించిన దానికంటే జనం ఎక్కవ సంఖ్యలో వచ్చారు.దీంతో వారు ఆమె స్టేజీ వద్దకు తీసుకెళ్లేందుకు నానా కష్టాలు పడాల్సి వచ్చింది.
ఇక ఎలాగోలా స్టేజీ వద్దకు వెళ్లిన శ్రద్ధా దాస్ అదిరిపోయే డ్యా్న్సులతో కుర్రకారును హుషారెత్తించింది.అయితే తిరిగి వెళ్లే సమయంలోనూ బౌన్సర్లు లేకపోవడంతో ఆమె జనాల మధ్య నలిగిపోయిందట.
దీంతో సదరు న్యూ ఇయర్ వేడుకల నిర్వాహకులపై శ్రద్ధా దాస్ సీరియస్ అయ్యిందట.జనాల అత్యుత్సాహంతో పాత సంవత్సరం ఆమెకు చేదు అనుభవాన్ని మిగిల్చిందని ఆమె పేర్కొన్నట్లు తెలుస్తోంది.