ఈమె టిక్ టాక్ భానుగా స్థిరపడిపోయారు.ప్రస్తుతం యూట్యూబ్ వీడియోలు ఇన్స్టాగ్రామ్ రీల్స్ ద్వారా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ అభిమానులను సందడి చేస్తున్న భాను బుల్లితెర కార్యక్రమాలపై కూడా సందడి చేస్తున్నారు.
ప్రస్తుతం ఈమె జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి కార్యక్రమాలలో కూడా ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.హైపర్ ఆది ద్వారా జబర్దస్త్ కార్యక్రమానికి పరిచయమైన భాను ఈ కార్యక్రమంతో విశేషమైన ప్రేక్షకాదరణ సంపాదించుకుంది.ఇక సోషల్ మీడియాలో ఏకంగా 1.5 మిలియన్ ఫాలోవర్స్ సంపాదించుకున్న భాను శ్రీదేవి డ్రామా కంపెనీ, జబర్దస్త్ కార్యక్రమం ద్వారా భారీగానే సంపాదిస్తున్నారని తెలుస్తోంది.ఇకపోతే ఈమె ఒక్క ఎపిసోడ్ కోసం తీసుకునే రెమ్యూనరేషన్ గురించి తెలిస్తే ప్రతి ఒక్కరు షాక్ అవ్వాల్సిందే.
ఇలా సోషల్ మీడియాలో బుల్లితెరపై ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న భాను ఒక్కో కాల్ షీట్ కోసం ఏకంగా లక్షపాతిక వేల రూపాయలను పారితోషికంగా తీసుకుంటున్నారని సమాచారం.ఇక బుల్లితెరపై ఈమెకు ఉన్న పాపులారిటీతో ఏకంగా తనకు సినిమా అవకాశాలు కూడా వస్తున్నాయని అయితే ఒకసారి వెండితెర పైకి వెళ్లి అవకాశాలు లేకపోతే తిరిగి బుల్లితెర కార్యక్రమాలకు వచ్చే అవకాశం ఉండదన్న ఉద్దేశంతో తాను బుల్లితెర కార్యక్రమాలలోనే కొనసాగుతున్నారని తెలుస్తోంది.