తెలంగాణలో రాజకీయాలలో రోజుకో సంచలనాలతో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది.అయితే కాంగ్రెస్ బలహీనంగా ఉన్న పరిస్థితులలో బీజేపీ క్షేత్ర స్థాయిలో కార్యకర్తల నిర్మాణంతో బలమైన పునాదులు చేపడుతూ క్రమక్రమంగా బలపడుతోంది.
అయితే ఈ క్రమంలో షర్మిల తెలంగాణలో ఏర్పాటు చేస్తానని ప్రకటించడంతో తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా అలజడి రేగిందని చెప్పవచ్చు.అయితే ఇప్పటికే పలు పార్టీలలో ఉన్న అసంతృప్తులు షర్మిలతో సంప్రదింపులు జరిపినట్టు సమాచారం.
అయితే ఇప్పటివరకు తన పార్టీ పేరును, పార్టీ సిద్ధాంతాలను ఇప్పటి వరకు ఇంకా ప్రకటించని షర్మిల, ఒక్కసారిగా ఘాటు వ్యాఖ్యలతో ఒక్కసారిగా అందరి దృష్టి ఆకర్శించాలన్నది షర్మిల వ్యూహంలా కనిపిస్తోంది.కేసీఆర్ టార్గెట్ గా షర్మిల దూసుకుపోనున్నట్లు తెలుస్తోంది.
ఏది ఏమైనా షర్మిల పార్టీ వలన ఎవరికి నష్టం జరుగుతుందో చూడాల్సి ఉంది.
అంతేకాక కేసీఆర్ పై ప్రజల్లో ఎటువంటి విషయాలపై వ్యతిరేకత ఉందో తెలుసుకుని ఇక వాటిని టార్గెట్ గా చేసుకొని టీఆర్ఎస్ ప్రభుత్వంపై విరుచుక పడే అవకాశం ఉంది.
అప్పుడు ఇక ప్రభుత్వంపై ప్రతిపక్షాలు అన్నీ కలిసి దాడి చేయడం ద్వారా టీఆర్ఎస్ కే లాభం జరిగే అవకాశం కూడా ఉంది.ఏది ఏమైనా షర్మిల స్టెప్ ను తెలంగాణ లోని రాజకీయ పార్టీలు ఎంతగానో వేచిచూస్తున్నాయని చెప్పాలి.