తెలంగాణలో బీజేపీ రోజురోజుకు ఎంతలా బలపడుతుందో మనం చూస్తూనే ఉన్నాం.ఒకప్పుడు కార్యకర్తలు లేక ఎటువంటి ఎన్నికల్లోనైనా ప్రభావం చూపని బీజేపీ ఇప్పుడు ఆ పరిస్థితికి పూర్తి భిన్నంగా తయారైంది.
ఎటువంటి అంచనాలు లేకుండా అసలు టీఆర్ఎస్ బీజేపీని అసలు లెక్కలోకి తీసుకునే పరిస్థితి.అటువంటి ప్రయత్నం నుండి ఇప్పుడు బీజేపీ వేస్తున్న వ్యూహాలకు టీఆర్ఎస్ ప్రతివ్యూహం పన్నడంలో విఫలమవుతోంది.
ఎటువంటి కార్యకర్తల నిర్మాణం లేకుండానే దుబ్బాక ఎన్నికల్లో విజయం సాధించిన నాటినుండి కార్యకర్తల నిర్మాణంపై బీజేపీ దృష్టి పెట్టింది.నియోజకవర్గ స్థాయిలో బీజేపీ మోర్చా, యువ మోర్చా కార్యావర్గాన్ని నిర్మిస్తూ స్థానికంగా బీజేపీని బలోపేతం చేస్తున్న పరిస్థితి ఉంది.
అంతేకాక ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకతను బలంగా నాటే ప్రయత్నాన్ని బీజేపీ చేస్తోంది.ఇటు టీఆర్ఎస్ కు కార్యకర్తల బలాన్ని బీజేపీ నిర్మించుకొని తదుపరి ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా బీజేపీ చాపకింద నీరులా టీఆర్ఎస్ పార్టీని కబళించే ప్రయత్నం చేస్తుందన్నదని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.
రోజురోజుకు క్షేత్ర స్థాయి నుండి బలపడేందుకు ప్రయత్నిస్తున్న బీజేపీ అలాగే ప్రజల్లో కూడా బీజేపీకి మద్దతు పలికితే టీఆర్ఎస్ కు కొంత ఇబ్బందికర పరిణామాలు ఎదురయ్యే అవకాశం ఉంది.