ఈ మధ్యకాలంలో బంధాలకు బంధుత్వాలకు విలువ లేకుండా పోతుంది.కట్టుకున్న వారికి కడవరకు తోడు ఉండాల్సింది పోయి దారుణంగా కడతెరుస్తున్నారు.
నాలుగు రోజుల కింద కర్నూలు జిల్లాలో జరిగిన ఓ మహిళ హత్య కేసును ఛేదించిన పోలీసులు విచారణలో నమ్మలేని సంచలన నిజాలు బయటపడ్డాయి.బార్య చెల్లి పై మోజు పడిన బావా భార్యను అతి కిరాతకంగా చంపినట్లు విచారణలో తేలింది.
ఇక ఈ కేసులో రవి నాయక్ తో పాటు అతనికి సహకరించిన మరో మహిళ రేఖ నాయక్ ను కూడా అదుపులోకి తీసుకున్నారు.బేతంచెర్ల మండలం గోరు మానుకొండ తండాకు చెందిన సుశీల భాయ్ కి అలెబాదు తండాకు చెందిన రవి నాయక్ తో వివాహం జరిగింది.
ఇక భార్య పొట్టి గా ఉందని తన మరదలితో అక్రమ సంబంధానికి తెరలేపాడు రవి నాయక్.ఈ విషయం భార్య వరకు వెళ్లడంతో ఇద్దరి మధ్య వివాదాలు మొదలయ్యాయి.
దీంతో మరదలితో సంబంధానికి భార్య అడ్డుగా ఉందని భావించి… సమీప బంధువు రేఖ నాయక్ తో కలిసి హత్య చేయాలనీ ప్లాన్ వేసాడు రవి నాయక్.
ఇక తన చావుకు ఎవరూ కారణం కాదు అన్నట్లుగా బలవంతంగా ఒక లేఖ రాయించాడు.
ఆ తర్వాత ఒక నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి తలపై బండరాయితో మోది కిరాతకంగా భార్యను చంపేశారు.ఇక ఆ తర్వాత తన భార్య కనిపించడం లేదంటూ కొత్త నాటకానికి తెరలేపాడు రవి నాయక్.
తన భార్య రాసిన లెటర్ చూపించి నమ్మించే ప్రయత్నం చేశాడు.కానీ లోయలో మహిళ మృతదేహాన్ని గమనించిన కాపరులు పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయగా అసలు నిజాలు బయటపడ్డాయి.