జగన్ ప్రచార సభలో అపశృతి....ఒకరు మృతి!

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఈ రోజు గుంటూరు జిల్లా లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే.అయితే ఈ పర్యటనలో అపశృతి చోటుచేసుకుంది.

 Short Circuit Near Jagan Campaigning-TeluguStop.com

గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో వైకాపా అధినేత జగన్‌ ఎన్నికల ప్రచారసభలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా జగన్ సభ కోసం చాలా మంది ప్రజలు అక్కడకి చేరుకున్నారు.

ఈ క్రమంలో జగన్ సభ లో ప్రసంగించిన అనంతరం జనరేటర్ వద్ద విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అవ్వడం తో పది మంది గాయపడినట్లు తెలుస్తుంది.అయితే ఈ ఘటనలో ఆర్టీసీ కండక్టర్ సోమి రెడ్డి(45) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తుంది.

అలానే ఈ ఘటనలో గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తుంది.క్షతగాత్రుల్లో మాచవరం మండలం మోర్జంపాడు గ్రామానికి చెందిన వృద్ధురాలు కృష్ణమ్మ పరిస్థితి విషమంగా ఉండటంతో ఆమెను గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

ఓ బాలుడి పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు.మిగిలిన క్షతగాత్రులకు పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు అధికారులు.

జగన్ సభలో ఈ విధంగా అపశృతి చోటుచేసుకోవడం ఇదే తొలిసారి ఏమీ కాదు.ఇటీవల తూర్పు గోదావరి జిల్లా లో నిర్వహించిన సభలో కూడా గోడ కూలి ముగ్గురు మృతి చెందిన సంగతి తెలిసిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube