రెండు రూపాయల గొడవ ప్రాణాలే తీసింది

జూనియర్ ఎన్టీఆర్ తాజాగా నటించిన అరవింద సమేత సినిమాలో ఫ్యాక్షన్ నేపధ్యం చూపించారు.అందులో ఇద్దరు వ్యక్తులు మధ్య ఏర్పడిన వివాదం కాస్తా రెండు ఊర్ల గొడవగా మారి ఎన్నో కుటుంబాలను బలి తీసుకుంటుంది.

 Shopwonermurderfor Two Rupees In Kakinada-TeluguStop.com

అసలు ఆ ఊర్ల మధ్య ఫ్యాక్షన్ గొడవలు రావడానికి కారణం ఐదు రూపాయలు గొడవ.అయితే అదంతా సినిమా కోసం చూపించారు.

కానీ నిజ జీవితంలో కూడా చిల్లర తగాదాలు రావడం, అది కాస్త ముదిరి ఓ వ్యక్తి ప్రాణాలు తీసే స్థాయికి వెళ్లిన ఘటన తాజాగా తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో జరిగింది.సైకిల్ టైర్ కు గాలి పట్టిన విషయంలో ఇద్దరు వ్యక్తుల మధ్య ఏర్పడిన తగాదా ఒకరి ప్రాణాలను తీసింది.

స్థానికంగా సైకిల్ షాపు నిర్వహిస్తున్న సువర్ణ రాజు వద్దకు అప్పారావు వ్యక్తి వచ్చి సైకిల్ కి గాలి పట్టించుకున్నాడు.ఆ తరువాత రూ రెండు రూపాయలు గాలి నిమిత్తం ఇవ్వాల్సిందిగా సువర్ణ రాజు అప్పారావు కోరాడు.

దీనిపై ఆగ్రహించిన అప్పారావు సువర్ణ రాజుని కత్తితో పొడవడంతో సువర్ణరాజు అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు.వెంటనే స్థానికులు అతడిని కాకినాడ జిజిహెచ్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ సువర్ణ రాజు మృతి చెందాడు.

రెండు రూపాయల కోసం ఏర్పడిన చిల్లర గొడవ కాస్తా ఒకరి ప్రాణాలు తీయడం స్థానికంగా సంచలనం రేపింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube